భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు.

0
60

 

భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

 

Andhra

AP High Court key ruling on building construction permits

భవన నిర్మాణ అనుమతులు నిరాకరించే అధికారం పంచాయతీలకు లేదన్న హైకోర్టు

భూమి యాజమాన్య వివాదాలను సివిల్ కోర్టులే తేల్చాలని వెల్లడి

కేవలం లీగల్ నోటీసు ఆధారంగా అనుమతి నిరాకరించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్య

నంద్యాల జిల్లా వాసి పిటిషన్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు

15 రోజుల్లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం

భూమి యాజమాన్య హక్కులకు (టైటిల్) సంబంధించిన వివాదాలు ఉన్నాయనే కారణంతో గ్రామ పంచాయతీలు భవన నిర్మాణ అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి వివాదాలను పరిష్కరించే అధికారం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంటుందని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి కీలక తీర్పు వెలువరించారు.

 

నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురానికి చెందిన కె. జమాల్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ టైటిల్‌ను ప్రశ్నిస్తూ మూడో పక్షం ఇచ్చిన లీగల్ నోటీసును ప్రాతిపదికగా తీసుకుని, భవన నిర్మాణ అనుమతిని నిరాకరిస్తూ 2023 డిసెంబర్ 24న గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాన్ని న్యాయస్థానం రద్దు చేసింది.

 

కేసు వివరాల్లోకి వెళితే.. జమాల్ రెడ్డి 2009లో సర్వే నంబర్ 408లో 4 సెంట్ల (195.5 చదరపు గజాలు) స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆయన ఇంటి పన్ను చెల్లిస్తూ అక్కడే నివసిస్తున్నారు. తన పాత కట్టడాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించుకోవడానికి అనుమతి కోరగా, పంచాయతీ కార్యదర్శి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి స్పందించిన పిటిషనర్, భవన నిర్మాణానికి అవసరమైన ప్లాన్, చలాన్ పత్రాలను సమర్పించారు.

 

2009 నాటి సేల్ డీడ్ చెల్లదంటూ విక్రయదారుల సోదరుడి వారసులు 2023 డిసెంబర్‌లో లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ నోటీసును సాకుగా చూపి పంచాయతీ అధికారులు నిర్మాణ అనుమతి దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. దాదాపు 16 ఏళ్లుగా సదరు వివాదంపై సివిల్ కోర్టును ఆశ్రయించని వారి నోటీసు ఆధారంగా అనుమతిని నిరాకరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. దరఖాస్తుదారుడి పేరు మీద టైటిల్ ఉందా లేదా, భూమి ఆయన స్వాధీనంలో ఉందా అనే అంశాలను మాత్రమే పంచాయతీలు పరిశీలించాలని సూచించింది. ఈ నేపథ్యంలో, 15 రోజుల్లోగా జమాల్ రెడ్డి దరఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.                                

Search
Categories
Read More
Andhra Pradesh
రెండేళ్లుగా తిరుగుతున్నా.. కలెక్టరేట్ వద్ద తల్లీబిడ్డల రోదన.
మదనపల్లె కలెక్టరేట్ వద్ద సోమవారం గోళ్లపల్లికి చెందిన రాజమ్మ తన దివ్యాంగుడైన కుమారుడు మనోహర్...
By Pagadala Venkateswar 2026-03-16 10:04:40 0 155
Nagaland
Boosting Diezephe: Naga Handicrafts and Tourism Drive
Representatives from Diezephe village have formally petitioned the state government for enhanced...
By Lokeshwari Panthadi 2026-07-02 07:14:15 0 70
Andhra Pradesh
ముగతి గ్రామంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ లో సత్తా చాటిన బోయ విజయ్
నందవరం మండల ముగతి గ్రామంలో బోయ వీరేష్ రెండో కుమారుడు బోయ విజయ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో...
By Boya Dasthagiri 2026-04-30 10:24:52 0 338
Andhra Pradesh
పెద్దమండెం.జిల్లా ఉత్తమ ఎంఈఓ గా మనోహర్
పెద్దమండ్యం మండల విద్యాశాఖాధికారి మనోహర్‌కు విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు గాను...
By Pagadala Venkateswar 2026-01-26 05:36:45 0 156
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ
పత్రికా ప్రకటన   ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026   తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల...
By Rajini Kumari 2026-01-28 13:09:57 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com