మహిళా సాధికారతకు టిడిపి మరో చారిత్రక అడుగు
*మహిళా సాధికారతకు టీడీపీ మరో చారిత్రక అడుగు*
*మంత్రి నారా లోకేష్ చొరవతో మహిళలకు ఉపాధి అవకాశాలు*
*స్త్రీ శక్తితో మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం*
*33 శాతం మహిళా రిజర్వేషన్కు డ్వాక్రా మహిళల హర్షం.. చంద్రబాబు, పవన్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం*
*మహిళా రిజర్వేషన్ నిర్ణయానికి డ్వాక్రా మహిళల మద్దతు*
*33 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం: మహిళలు*
*రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం.. డ్వాక్రా మహిళల హర్షం*
*మహానాడు తీర్మానానికి స్వాగతం.. మహిళల అభినందన సభ*
*ఆర్థికంగా బలోపేతం చేస్తున్న స్త్రీ శక్తి పథకమని మహిళల ప్రశంసలు*
*ఆకుల జయసత్య, తమ్మిశెట్టి జానకి దేవి, గడ్డం సామ్రాజ్యం*
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే తెలుగుదేశం పార్టీ మహానాడులో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి మంగళగిరి మండలం నవులూరు–ఎర్రబాలెం ప్రాంతాల డ్వాక్రా మహిళలు ఘన స్వాగతం పలికారు. మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం నవులూరు టిడ్కో గృహ సముదాయంలో అభినందన సభ నిర్వహించారు.. డ్వాక్రా మహిళల తోట సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయ సత్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు జిల్లా అంగన్వాడీ కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డం సామ్రాజ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మహానాడులో తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో మహిళల పాత్రను మరింత బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన, రాజకీయ సాధికారత లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.....టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయ సత్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు జిల్లా అంగన్వాడీ కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డం సామ్రాజ్యం లు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించి కుటుంబాల అభ్యున్నతికి బాటలు వేశారని కొనియాడారు.రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, మంగళగిరి నియోజకవర్గంలో ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా వేలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు. వృత్తి నైపుణ్య శిక్షణలు, కుట్టు మిషన్ల పంపిణీ, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలిపారు.‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలు కుట్టు, ఉపాధి సంబంధిత శిక్షణలు పొందడమే కాకుండా కుట్టు మిషన్లు వంటి ఉపాధి సాధనాలను పొందుతున్నారని, దీంతో స్వయం ఉపాధి ద్వారా ఆదాయం సంపాదిస్తూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని వివరించారు. మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతోందని అన్నారు.మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ, వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే కీలక నిర్ణయంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.మహిళా సాధికారతకు కట్టుబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల నాయకత్వంపై మహిళలు విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళల అభివృద్ధి కోసం తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో నవులూరు, ఎర్రబాలెం ప్రాంతాలకు చెందిన డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా రిజర్వేషన్ నిర్ణయాన్ని స్వాగతించారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz