గంజాయి మత్తు నుంచి యువతను కాపాడుదాం:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

0
162

 

 

 

*మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి... లేకపోతే జైలుకే*

 

*డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన సీపీ*

 

గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై చికిత్స పొందుతున్న వ్యక్తులను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. గంజాయి నిర్మూలనతో పాటు గంజాయికి బానిసైన వారిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీపీ,15 రోజుల చికిత్సా కాలంలో ప్రతి ఒక్కరిలో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు.

వైద్య సిబ్బందితో మాట్లాడుతూ, గంజాయి బాధితుల్లో సత్ప్రవర్తన, సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని,వారి ప్రవర్తనలో లేదా శారీరక పరిస్థితిలో ఏవైనా అసాధారణ మార్పులు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.చికిత్స అనంతరం మళ్లీ మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.గంజాయి విక్రేతలు,మత్తు పదార్థాల సరఫరాదారులపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు.డ్రగ్స్ రహిత కమిషనరేట్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, వైద్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
100 సం. బావి విక్రయంపై కోర్టును ఆశ్రయించిన గ్రామస్థుడు.
మదనపల్లె మండలం కొత్తవారిపల్లె రెవెన్యూ గ్రామంలోని రెడ్డివారిపల్లెలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర...
By Pagadala Venkateswar 2026-06-12 04:18:48 0 78
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ ..10.30 గంటల సమయానికే 60 శాతం పంపిణీ.
ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-31 05:53:21 0 145
Andhra Pradesh
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:12:11 0 77
Andhra Pradesh
చీరాలలో ఘనంగా జర్నలిస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు – పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన చీరాల జర్నలిస్టులు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని...
By Vadlamudi NagaVenkat 2026-04-14 09:43:39 0 170
Andhra Pradesh
కొండ సముద్రం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పుంగనూరు మండలం, కొండ సముద్రం చెరువులో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు...
By Kothuru Murali 2026-06-09 13:51:48 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com