చింతూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం: మంటల్లో దగ్ధమైన గూడ్స్ లారీ!

0
55

చింతూరు మార్గంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుండి చింతూరు వైపు వెళ్తున్న ఒక గూడ్స్ లారీ (నెంబర్: CG 18S 8034) ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది.మారేడుమిల్లి నుండి చింతూరు వైపు ఘాటీ దిగి తులసిపాక రాగానే, లారీ వెనుక వైపు ఉన్న టైర్ల నుండి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. లారీ డ్రైవర్ గమనించే లోపే ఆ నిప్పురవ్వలు కాస్తా పెద్ద మంటలుగా మారి, క్షణాల వ్యవధిలోనే వాహనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. లారీ పూర్తిగా అగ్నిఆహుతి అయిపోయింది.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
'భూమా'సురులనుండి రక్షించండి- భాధితుల ఆవేదన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు...
By Sidhu Maroju 2025-11-29 15:56:23 0 181
Telangana
రెండు బైకలు డికొన్నాయి
సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే జాతీయ రహదారి పైన అల్లదుర్గ్ చౌరస్తా దగ్గర రెండు బైకలు ఎదురు ఎదురుగా...
By Gandla Vaijanath 2026-06-04 07:32:05 0 42
Andhra Pradesh
దళితులకు భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసి దళిత నాయకులు
దళితుల భూ సమస్యలు ఎస్సీ ఎస్టీ కేసు రిలీఫ్లు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ను కలిసిన దళిత...
By Chennaiah Kati 2026-03-10 13:14:04 0 298
Andhra Pradesh
పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి...
By Kothuru Murali 2026-05-15 15:31:56 0 52
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడి
రొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు...
By Kothuru Murali 2026-04-02 06:46:37 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com