చింతూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం: మంటల్లో దగ్ధమైన గూడ్స్ లారీ!

0
56

చింతూరు మార్గంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుండి చింతూరు వైపు వెళ్తున్న ఒక గూడ్స్ లారీ (నెంబర్: CG 18S 8034) ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది.మారేడుమిల్లి నుండి చింతూరు వైపు ఘాటీ దిగి తులసిపాక రాగానే, లారీ వెనుక వైపు ఉన్న టైర్ల నుండి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. లారీ డ్రైవర్ గమనించే లోపే ఆ నిప్పురవ్వలు కాస్తా పెద్ద మంటలుగా మారి, క్షణాల వ్యవధిలోనే వాహనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. లారీ పూర్తిగా అగ్నిఆహుతి అయిపోయింది.అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Telangana
దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త
ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ...
By Boiena Rajesh 2026-03-01 09:10:24 0 157
Health & Fitness
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection As...
By BMA ADMIN 2025-05-20 05:49:20 0 2K
Andhra Pradesh
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-01-14 07:54:50 1 894
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుపతిలో పీ4 వార్షికోత్సవం... మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు.
పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పీ4 (పేదరికంపై గెలుపు) కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-03-31 03:47:09 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com