"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|

0
152

హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో  నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జూన్ 2న ఈ సభను నిర్వహించేందుకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేపట్టగా, భద్రతా కారణాలను చూపుతూ పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం ఆ వేడుకల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

అదే రోజు పెద్ద ఎత్తున రాజకీయ సభ నిర్వహిస్తే ట్రాఫిక్ రద్దీతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని అభిప్రాయపడిన అధికారులు సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన నాయకత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది. సభ నిర్వహణకు అనుమతి కల్పించాలని కోరుతూ పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణలో పార్టీ విస్తరణ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నామని జనసేన వర్గాలు చెబుతుండగా, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, రాంపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ (21) ఈనెల 19న ద్విచక్ర వాహనంపై...
By Kothuru Murali 2026-05-28 18:32:27 0 62
Telangana
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.
హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు...
By Sidhu Maroju 2025-08-23 10:10:11 0 570
Andhra Pradesh
NVIDIA in AP
NVIDIA has come forward to work with the AP government to create an AI ecosystem in Andhra...
By Terli Ashok 2026-01-25 05:27:57 0 182
Andhra Pradesh
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
By Pagadala Venkateswar 2026-03-01 04:17:20 0 123
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు
ప్రకటన: మార్చి 07, 2026 విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో...
By Rajini Kumari 2026-03-06 10:56:24 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com