విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు

0
149

ప్రకటన: మార్చి 07, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండవ రోజు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి సందర్భంగా శనివారం యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించనున్నారు 

రెండవ రోజు కార్యక్రమ వివరాలు:

ఉదయం 8:00 గంటలకు: వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పీఠ పూజలు ప్రారంభమవుతాయి

మధ్యాహ్నం 12:00 గంటలకు: యాగశాలలో మూలమంత్రహవనములు నిర్వహించబడతాయి 

సాయంత్రం 4:00 గంటల నుండి: మూలమంత్రహవనములు, ప్రదోషకాల పీఠపూజలు మరియు హారతి కార్యక్రమాలు ఉంటాయి 

రాత్రి 7:00 గంటలకు: మంత్రపుష్పంతో నేటి కార్యక్రమాలు ముగుస్తాయి 

పత్రికా ప్రకటన: మార్చి 08, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం నేటితో (ఆదివారం) ముగియనుంది. ఈ పవిత్ర క్రతువులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పర్యవేక్షణలో కుంభాభిషేకం జరుగనుంది .

ముఖ్య ఘట్టాలు:

ఉదయం 7:00 గంటలకు: మంటప పూజలు, మూలమంత్ర హవనములు ప్రారంభమవుతాయి 

ఉదయం 9:00 గంటలకు: పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది 

ఉదయం 9:34 గంటలకు (మేషలగ్నంలో): శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర విమానగోపురమునకు కంచి పీఠాధిపతుల అమృత హస్తాలతో, పవిత్ర నదీ జలాలతో కుంభాభిషేక క్రతువు నిర్వహించబడుతుంది 

అనుగ్రహ భాషణము: కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణము చేస్తారు 

ఈ మహోత్సవం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆలయ దైవిక శక్తిని పెంపొందించడానికి నిర్వహించబడుతుంది

Search
Categories
Read More
Andhra Pradesh
పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని...
By Boiena Rajesh 2026-05-27 14:00:46 0 192
Telangana
కవిత ప్రాoచజన్యం పేరుతో 5హామీలను ప్రకటించారు
కవిత "ప్రాంచజన్యం"..,పేరుతో ఐదు హామీలను ప్రకటించారు  1: విద్య ప్రైవేటు స్కూళ్లలో కూడా...
By MERIGE MALLESH 2026-04-25 07:45:04 0 560
Andhra Pradesh
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు
సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన...
By Chennaiah Kati 2026-02-03 18:13:35 0 226
Andhra Pradesh
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య
కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య! తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్...
By Chennaiah Kati 2026-03-09 13:31:51 0 349
Puducherry
Puducherry Rolls Out Financial Inclusion Campaign Across Panchayats
From July 1 to September 30, Puducherry is implementing a Financial Inclusion Saturation Campaign...
By Bharat Aawaz 2025-07-17 11:22:40 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com