విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు

0
150

ప్రకటన: మార్చి 07, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండవ రోజు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి సందర్భంగా శనివారం యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించనున్నారు 

రెండవ రోజు కార్యక్రమ వివరాలు:

ఉదయం 8:00 గంటలకు: వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పీఠ పూజలు ప్రారంభమవుతాయి

మధ్యాహ్నం 12:00 గంటలకు: యాగశాలలో మూలమంత్రహవనములు నిర్వహించబడతాయి 

సాయంత్రం 4:00 గంటల నుండి: మూలమంత్రహవనములు, ప్రదోషకాల పీఠపూజలు మరియు హారతి కార్యక్రమాలు ఉంటాయి 

రాత్రి 7:00 గంటలకు: మంత్రపుష్పంతో నేటి కార్యక్రమాలు ముగుస్తాయి 

పత్రికా ప్రకటన: మార్చి 08, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం నేటితో (ఆదివారం) ముగియనుంది. ఈ పవిత్ర క్రతువులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పర్యవేక్షణలో కుంభాభిషేకం జరుగనుంది .

ముఖ్య ఘట్టాలు:

ఉదయం 7:00 గంటలకు: మంటప పూజలు, మూలమంత్ర హవనములు ప్రారంభమవుతాయి 

ఉదయం 9:00 గంటలకు: పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది 

ఉదయం 9:34 గంటలకు (మేషలగ్నంలో): శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర విమానగోపురమునకు కంచి పీఠాధిపతుల అమృత హస్తాలతో, పవిత్ర నదీ జలాలతో కుంభాభిషేక క్రతువు నిర్వహించబడుతుంది 

అనుగ్రహ భాషణము: కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణము చేస్తారు 

ఈ మహోత్సవం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆలయ దైవిక శక్తిని పెంపొందించడానికి నిర్వహించబడుతుంది

Search
Categories
Read More
Andhra Pradesh
DSF PDSO ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది
ఆదోని పట్టణంలో కార్పొరేట్ భాష్యం పాఠశాలకు, ప్రభుత్వ నిబంధనలు వర్తించవని కొనియాడారు. అనంతరం...
By Boya Dasthagiri 2026-05-08 09:58:45 0 129
Technology
OpenAI Initiates Major Product Team Restructuring
In its latest internal shake-up, OpenAI is planning to consolidate ChatGPT, its developer-facing...
By Dunna Jessicaruth 2026-05-18 12:11:56 0 88
Andhra Pradesh
ఈనెల 23 న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
*ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు*   తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల...
By Rajini Kumari 2025-12-22 07:52:39 0 225
SURAKSHA
Navin Mittal IAS: Leading Telangana's Transformation
From IIT Delhi to Special Chief Secretary of Energy, this 1996-batch administrator has spent...
By Lokeshwari Panthadi 2026-07-10 06:17:40 0 138
Andhra Pradesh
మదనపల్లి నుండి కదిరి క్షేత్రానికి 'సుదర్శన సేన' పాదయాత్ర.
కదిరి పౌర్ణమి మహోత్సవాలను పురస్కరించుకుని, మదనపల్లికి చెందిన సుదర్శన సేన సభ్యులు ఆదివారం...
By Pagadala Venkateswar 2026-03-02 03:16:24 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com