విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి రెండవ రోజు కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు

0
100

ప్రకటన: మార్చి 07, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు రెండవ రోజు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫాల్గుణ బహుళ చవితి సందర్భంగా శనివారం యాగశాలలో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించనున్నారు 

రెండవ రోజు కార్యక్రమ వివరాలు:

ఉదయం 8:00 గంటలకు: వివిధ పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పీఠ పూజలు ప్రారంభమవుతాయి

మధ్యాహ్నం 12:00 గంటలకు: యాగశాలలో మూలమంత్రహవనములు నిర్వహించబడతాయి 

సాయంత్రం 4:00 గంటల నుండి: మూలమంత్రహవనములు, ప్రదోషకాల పీఠపూజలు మరియు హారతి కార్యక్రమాలు ఉంటాయి 

రాత్రి 7:00 గంటలకు: మంత్రపుష్పంతో నేటి కార్యక్రమాలు ముగుస్తాయి 

పత్రికా ప్రకటన: మార్చి 08, 2026

విజయవాడ, ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం నేటితో (ఆదివారం) ముగియనుంది. ఈ పవిత్ర క్రతువులో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పర్యవేక్షణలో కుంభాభిషేకం జరుగనుంది .

ముఖ్య ఘట్టాలు:

ఉదయం 7:00 గంటలకు: మంటప పూజలు, మూలమంత్ర హవనములు ప్రారంభమవుతాయి 

ఉదయం 9:00 గంటలకు: పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడుతుంది 

ఉదయం 9:34 గంటలకు (మేషలగ్నంలో): శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయ శిఖర విమానగోపురమునకు కంచి పీఠాధిపతుల అమృత హస్తాలతో, పవిత్ర నదీ జలాలతో కుంభాభిషేక క్రతువు నిర్వహించబడుతుంది 

అనుగ్రహ భాషణము: కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు భక్తులకు అనుగ్రహ భాషణము చేస్తారు 

ఈ మహోత్సవం ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఆలయ దైవిక శక్తిని పెంపొందించడానికి నిర్వహించబడుతుంది

Search
Categories
Read More
Andhra Pradesh
పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల హాస్పిటల్ లో చికిత్స
కోడుమూరు నియోజకవర్గం కర్నూల్ మండలం దీన్నేదేవరపాడు కి చెందిన పెరుగు చంద్రారెడ్డి అనారోగ్య...
By mahaboob basha 2025-09-21 14:05:10 0 285
Andhra Pradesh
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:52:50 0 338
Telangana
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ   పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా...
By Pinnehasan Odela 2025-12-21 09:31:16 0 231
Andhra Pradesh
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2025-12-30 12:44:14 0 123
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com