"బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.. ప్రముఖుల వెల్లువ.|

0
216

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు.

బాధ్యతల స్వీకరణకు ముందు ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 

ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనాలు అందించగా, సీనియర్ నాయకులు కేకె (కే.కేశవరావు) తన ఆశీస్సులను అందజేశారు. 

చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మికి రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. 

శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, మరియు దానం నాగేందర్ తదితరులు ఉన్నారు. 

వీరందరి సమక్షంలో విజయలక్ష్మి నూతన బాధ్యతలను స్వీకరిస్తూ మహిళా సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు తన వంతు కృషి చేస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మరియు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ....

గద్వాల విజయలక్ష్మి నాయకత్వంలో మహిళా కమిషన్ మరింత బలోపేతం అవుతుందని, మహిళల సమస్యల పరిష్కారంలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

మహిళల భద్రత, సాధికారత ధ్యేయంగా నూతన చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో కమిషన్ సరికొత్త మైలురాళ్లను అందుకుంటుందని నేతలు ఈ సందర్భంగా కొనియాడారు.

#sidhumaroju

Search
Categories
Read More
Business & Finance
Bank Loan Rating Improves Your Business Loan Approval
A bank loan rating evaluates your business's financial strength and creditworthiness before...
By Navya Sree 2026-07-14 07:16:39 0 80
Andhra Pradesh
మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.
మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ...
By Pagadala Venkateswar 2026-05-18 04:20:06 0 79
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ టు కేడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాశినేని మహేంద్ర నాయుడు
 ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం...
By Benguluri Madhubabu 2026-04-07 06:35:13 0 210
Andhra Pradesh
తెలంగాణ సీఎం ని కలిసిన ఆంధ్ర ఐటీ మినిస్టర్
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్...
By Rajini Kumari 2026-01-22 12:01:55 0 200
Andhra Pradesh
సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.
అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్....
By Ratna Sekhar 2026-03-11 07:35:36 0 366
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com