వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
202

నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ గారి వ్యవహార శైలిపై తగిన చర్యలు తీసుకోవాలి అని వివరించడం జరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని నందవరం మండలంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా నందవరం మండలం కనకవీడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘటనలో అసలు తప్పు టిడిపి నాయకులదే ఉన్నప్పటికీ, కావాలనే వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వివరించారు.అలాగే మండలంలోని ఏటిగడ్డ ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక, మట్టి తరలింపులు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వైఎస్ఆర్సిపి నాయకులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. మండలం లో బెల్ట్ షాపుల వ్యవహారంపై కూడా తగిన తనిఖీలు నిర్వహించకుండా అలసత్వం వహిస్తున్నారని తెలిపారు.నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసులు, వేధింపులు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై సమగ్రంగా వివరించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, నందవరం సబ్ ఇన్స్పెక్టర్ వారి పై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫారం కార్యదర్శి కనకవీడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మండల సీనియర్ నాయకులు, మండల కన్వీనర్ బి.ఆర్ బసి రెడ్డి గారు, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్ బాషా,చంద్రబాబు, పెద్ద ఈరన్న, గిడ్డయ్య,వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు...
By Kothuru Murali 2026-05-07 12:25:22 0 115
Andhra Pradesh
మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు.......... మరో అరెస్టు
మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్...
By Pagadala Venkateswar 2026-04-20 03:34:26 0 104
Prop News
Welcome to PROPIINN – Your Dream, Our Vision
In today’s real estate world, confusion often outweighs clarity. Searching for a flat?...
By Hazu MD. 2025-05-19 11:42:25 0 4K
Andhra Pradesh
కిష్టవరం టోల్గేట్ వద్ద కిలోమీటర్ మేర భారీగా వాహనాలు , పట్టించుకోకుండా సర్వర్ ఇష్యూ అంటూ సిబ్బంది, ఎన్ని రోజులు ఈ అగపాట్లు అంటూ ప్రయాణికులు!
కిర్లంపూడి,కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేటు వద్ద గురువారం కిలోమీటర్ల కొద్దీ వాహనాల రద్దీ ఉండడం,...
By Nandika Jayababu 2026-04-30 18:49:59 0 390
Andhra Pradesh
బ్యాంకులో బంగారం మాయం చేసిన కుమారుడిపై తల్లి ఫిర్యాదు.
మదనపల్లెలో తన పేరుపై బ్యాంకులో తనఖా పెట్టిన 44.5 గ్రాముల బంగారు ఆభరణాలను, తనకు తెలియకుండా పెద్ద...
By Pagadala Venkateswar 2026-04-07 03:55:40 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com