వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రూరల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
203

నందవరం సబ్ ఇన్స్పెక్టర్ గారి పై చర్యలు తీసుకోవాలి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ గారి వ్యవహార శైలిపై తగిన చర్యలు తీసుకోవాలి అని వివరించడం జరిగింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని నందవరం మండలంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా నందవరం మండలం కనకవీడు గ్రామంలో ఇటీవల జరిగిన ఘటనలో అసలు తప్పు టిడిపి నాయకులదే ఉన్నప్పటికీ, కావాలనే వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వివరించారు.అలాగే మండలంలోని ఏటిగడ్డ ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక, మట్టి తరలింపులు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వైఎస్ఆర్సిపి నాయకులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. మండలం లో బెల్ట్ షాపుల వ్యవహారంపై కూడా తగిన తనిఖీలు నిర్వహించకుండా అలసత్వం వహిస్తున్నారని తెలిపారు.నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసులు, వేధింపులు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగంపై సమగ్రంగా వివరించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు, నందవరం సబ్ ఇన్స్పెక్టర్ వారి పై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల ఫారం కార్యదర్శి కనకవీడు లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మండల సీనియర్ నాయకులు, మండల కన్వీనర్ బి.ఆర్ బసి రెడ్డి గారు, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు చాంద్ బాషా,చంద్రబాబు, పెద్ద ఈరన్న, గిడ్డయ్య,వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కోటి సంతకాల సేకరణలో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేరుని నాని జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక గారు తదితరులు పాల్గొన్నారు
*కోటి సంతకాల సేకరణ లో భాగంగా కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా తాడేపల్లి...
By Rajini Kumari 2025-12-15 11:37:55 0 207
Andhra Pradesh
ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు
 కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు...
By Boya Dasthagiri 2026-05-14 03:19:53 0 169
Andhra Pradesh
మదనపల్లిలో టమోటా పంట దగ్ధం: కన్నీరుమున్నీరవుతున్న రైతు
మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప...
By Pagadala Venkateswar 2026-02-26 11:10:54 0 131
Telangana
బిజెపి అభ్యర్థి తో...బిఆర్ఎస్ కు ఓటువేయమంటున్న మాజీ మంత్రి
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ ఆవాజ్): మండల కేంద్రంలో స్థానికల ఎన్నికల ప్రచార...
By Bheeshman King 2025-12-14 14:58:17 0 360
Andhra Pradesh
పుంగనూరు: రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను సోమవారం సీఐ...
By Kothuru Murali 2026-06-16 13:42:33 0 86
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com