స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.

0
81

కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం

ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం

అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు

ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం  

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి తీసుకెళ్లి, వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు.

 

అనంతరం, మార్కెట్‌లో పరిచయమైన మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. తాను తెచ్చిన చేపలను వండమని తానంగారి బాబు భార్య వెంకమ్మకు ఇచ్చారు. ఆమె చేపల పులుసు వండుతుండగా, చంద్రబాబు అక్కడే ఉండి ఆసక్తిగా గమనించారు. కొద్దిసేపు ఆయన కూడా గరిటె తిప్పారు. వంట పూర్తయ్యాక, సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేశారు. తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. తమ ఇంటికి వచ్చి, తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Search
Categories
Read More
Puducherry
Puducherry Strengthens Waste Management and Clean Cities
Puducherry continues to enhance waste management and clean city initiatives in 2026 by improving...
By Fathima Safa 2026-07-04 13:28:08 0 65
Andhra Pradesh
వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు.
    వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం...
By Pagadala Venkateswar 2026-04-28 05:57:51 0 115
Andhra Pradesh
సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.
సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.   డాక్టర్ మన్నె రవీంద్ర  పెద్ద...
By Chennaiah Kati 2026-02-23 15:35:20 0 246
Andhra Pradesh
భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో చీరాలకు చెందిన యువకుడు దేవరకొండ ప్రేమ్ సాగర్ అద్భుత ప్రతిభ
చీరాల: భోపాల్‌లో జరిగిన సౌత్ వెస్ట్ జోన్ యూనివర్సిటీ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో...
By Gadiyapudi Narendra 2026-01-17 17:00:09 0 197
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
*ఆంధ్రప్రదేశ్ ను తాకిన నైరుతి రుతుపవనాలు*   ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు...
By Rajini Kumari 2026-06-06 11:04:10 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com