స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.

0
82

కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం

ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం

అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు

ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం  

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి తీసుకెళ్లి, వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు.

 

అనంతరం, మార్కెట్‌లో పరిచయమైన మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. తాను తెచ్చిన చేపలను వండమని తానంగారి బాబు భార్య వెంకమ్మకు ఇచ్చారు. ఆమె చేపల పులుసు వండుతుండగా, చంద్రబాబు అక్కడే ఉండి ఆసక్తిగా గమనించారు. కొద్దిసేపు ఆయన కూడా గరిటె తిప్పారు. వంట పూర్తయ్యాక, సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేశారు. తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. తమ ఇంటికి వచ్చి, తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Search
Categories
Read More
Delhi - NCR
Delhi Police Arrest 255 in Operation Kavach Drive
Delhi Police arrested 255 alleged drug traffickers during the 14th edition of Operation Kavach, a...
By Navya Sree 2026-06-27 06:33:54 0 61
Andhra Pradesh
ViT సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించిన కేంద్రమంత్రి
పత్రికా ప్రకటన    *వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన...
By Rajini Kumari 2025-12-20 11:45:01 0 180
Telangana
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి...
By Veeresh Kumar 2026-03-24 16:44:18 2 944
Prop News
PROPIINN Uncovers the Real Story Behind Every Property
Before You Buy, Know the Ground Because every property has a story—PROPIINN helps you read...
By Bharat Aawaz 2025-06-26 05:45:12 0 2K
Andhra Pradesh
శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాలు విందులో పాల్గొన్నా రాజంపే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు గ్రామ పరిధిలోని నాగన్న గుట్ట పాలెం లో మంగళవారం...
By Benguluri Madhubabu 2026-03-24 11:56:22 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com