హైదరాబాద్ కా పైచాన్ !పెహల్వాన్ తెలంగాణ కేసరి విజేతలను ఘన సన్మానంచిన : మంత్రి వివేక్ వెంకటస్వామి

0
185

హైదరాబాద్, మే 12 : గతంలో హైదరాబాద్ కా పైచాన్ అంటే హైదరాబాద్ కా పెహల్వాన్ అనే పేరు ఉండేది” అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. సరైన అవకాశాలు లేకపోవడంతో ఎంతో ప్రతిభ కలిగిన కుస్తీ క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోయారని పేర్కొన్నారు.ఇటీవల ఎల్బీ స్టేడియంలో మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కేసరి–2026 కుస్తీ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం పెహల్వాన్లకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని తెలిపారు. కుస్తీ క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి అంజన్ కుమార్ యాదవ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక మంచి పెహల్వాన్అని పేర్కొన్నారు.వ్యాయామశాలల సంస్కృతి ఒకప్పుడు హైదరాబాద్‌లో ఎంతో బలంగా ఉండేదని గుర్తు చేసుకుంటూ, తన తండ్రి కాకా వెంకటస్వామి కూడా వ్యాయామశాలకు వెళ్లేవారని మంత్రి తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని అన్నారు.పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించిన మంత్రి, వారు మరింత శిక్షణ తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, నిర్వాహకులు, కుస్తీ అభిమానులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Tamilnadu
బస్తీల అభివృద్దే ధ్యేయంగా, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బస్తీల అభివృద్ధే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన...
By Sidhu Maroju 2025-11-24 08:04:31 0 187
Business & Finance
Sensex Opens Higher as Investor Confidence Improves
Mumbai's financial markets opened on a positive note as the Sensex gained in early trading and...
By Navya Sree 2026-07-03 05:31:02 0 26
Andhra Pradesh
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:10:15 0 524
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 207
Andhra Pradesh
గోసం రక్షణ గో సేవకు లక్ష రూపాయల విరాళం
గో సంరక్షణ కోసం రూ. 1,00,000 అందజేత   శ్రీ పి. సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు...
By Rajini Kumari 2026-03-14 11:43:35 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com