చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
268

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్ లో రజకసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బానిస బతుకులకు,వెట్టిచాకిరికి, భూస్వాములు, జమిందారుల దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాడిన తీరును కొనియాడారు. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ కలిగిన మహిళ అని, భూస్వాములు జమీందారుల ఇళ్లల్లో బలహీన వర్గాల మహిళలు వెట్టి చాకిరి చేసేవారని ఆ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ గారు పోరాడారని చెప్పారు. రైతులు తాము పండించిన పంటను జమీందారులు, భూస్వాములు, దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వచ్చేదని, దానితో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యేవారని, ఆ దోపిడీకి వ్యతిరేకంగా వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం చేశారని, ఆమె పోరాటపటిమ నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చాకలి ఐలమ్మ  ప్రాధాన్యతను గుర్తుంచుకుని, భావి తరాలకు వారి ఖ్యాతిని తెలియజేయడం కోసం కోఠి లోని మహిళా యూనివర్సిటీకి వారి పేరు పెట్టి "చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ" గా నామకరణం చేశారని, ఇది చాకలి ఐలమ్మ  పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధని తెలిపారు. ఈ జయంతి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సి.ఇ.ఓ మధుకర్ నాయక్ గారు,కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, రజకసంఘం నాయకులు సోమన్న,కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
బస్సు ఆపకుండా వెళ్ళిపోయినందుకు బస్సు డ్రైవర్ ని చెప్పుతో కొట్టిన మహిళ
*ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో కొట్టిన మహిళ.*     బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ...
By Rajini Kumari 2026-04-24 12:18:38 0 122
Telangana
నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర...
By Sadaq Sadaq 2026-04-21 09:20:12 0 107
Andhra Pradesh
Putta Mahesh: పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా...
By Pagadala Venkateswar 2026-03-18 06:56:21 0 152
Andhra Pradesh
మదనపల్లె ఘటన.. ఘోరంగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
మదనపల్లెలోని రాగిమానిదిన్నెపల్లెలో కుమార్తె రిషిక ప్రియా మృతదేహాన్ని చూసి తల్లి తీవ్ర దుఃఖంలో...
By Pagadala Venkateswar 2026-02-18 07:07:05 0 132
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
By Sadaq Sadaq 2026-03-31 17:28:11 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com