"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|

0
332

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

ఈ క్రమంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మరియు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే కనుమరుగైందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేస్తున్నా, ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు నిధులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, ఈ పర్యటనలో సుమారు రూ. 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి కూడా సన్నాహక సమావేశాల్లో పాల్గొని సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో నగరంలోని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని మోదీకి తమ మద్దతు తెలపాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Karnataka
Purple Line Metro Disruption Delays Bengaluru Commuters
A technical malfunction on Bengaluru’s Purple Line Metro caused significant service...
By Navya Sree 2026-06-25 13:52:16 0 106
SURAKSHA
Dr. Ravada A. Chandrasekhar IPS: Guardian of Kerala
From Intelligence Bureau to State Police Chief: The 1991-batch officer leading Kerala Police with...
By Kalaga Sailaja 2026-07-21 06:25:26 0 18
Telangana
"Helmet On, Worries Gone" సందేశంతో సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ శిల్పావిష్కరణ.|
సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్...
By Sidhu Maroju 2026-06-01 16:09:47 0 233
Punjab
Government Doctors Must Submit Medico-Legal Reports Within 48 Hour
Punjab’s Health Department has issued a directive requiring all government doctors to...
By Bharat Aawaz 2025-07-17 07:24:14 0 1K
Andhra Pradesh
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
By Kothuru Murali 2026-03-29 07:24:25 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com