"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|

0
333

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 

ఈ క్రమంలో సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మరియు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కలిసి గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గతంలో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగైతే కనుమరుగైందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. 

రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేస్తున్నా, ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు నిధులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక మొదటిసారి తెలంగాణకు వస్తున్నారని, ఈ పర్యటనలో సుమారు రూ. 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి కూడా సన్నాహక సమావేశాల్లో పాల్గొని సభను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో నగరంలోని అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని మోదీకి తమ మద్దతు తెలపాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు.
గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా...
By John Baji 2026-02-03 01:32:28 0 285
Media Academy
🌟 BMA Academy: Building Journalists for Tomorrow
🌟 BMA Academy: Building Journalists for Tomorrow At BMA Academy, we don’t just teach; we...
By Media Academy 2025-04-29 08:41:17 0 3K
Telangana
నేరేడు పండ్లు కాశాయి.. ఇక వర్షాలు కష్టమేనా?"|
"నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే వర్షాలు పడవా? అపోహలపై నిపుణుల స్పష్టీకరణ" హైదరాబాద్ : ఈ ఏడాది పలు...
By Sidhu Maroju 2026-06-24 12:34:07 0 67
Telangana
జూన్ 16 నుండి 28 వరకు హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ : అధ్యక్షులు నరేంద్ర రామ్ నంబూల
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బాలయోగి అథ్లెటిక్స్  స్టేడియంలో జూన్ 16 నుండి 28...
By Avunoori Mahesh 2026-06-14 10:20:48 0 253
Telangana
మల్కాజిగిరిలో బీజేపీ SIR అవగాహన సదస్సు.. కాంగ్రెస్, ఎంఐఎంపై ఈటల విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ...
By Sidhu Maroju 2026-06-23 08:07:55 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com