విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు.

0
58

ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం

ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం

తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్

బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరవుతున్న 51 మంది వైద్యులను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

 

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. వీరిలో కొందరు ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా విధులకు రాకుండా, ప్రైవేటు పనుల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా నియమాలు)-1964 ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

వీరితో పాటు, ఏడాదిలోపు గైర్హాజరైన మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 11 మంది ఇప్పటికే తిరిగి విధుల్లో చేరారని, మిగిలిన వారు నిర్దేశిత గడువులోగా హాజరుకాకపోతే వారిని కూడా తొలగిస్తామని హెచ్చరించారు. "విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదు" అని మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించాలి
గో మాతను జాతీయ ప్రాణి గా ప్రకటించారని నవీపేట్ లో శోభా యాత్రగా ప్రధాన వీధుల గుండా వెళ్లి...
By Sadaq Sadaq 2026-04-27 16:10:03 0 99
Andhra Pradesh
Ugadi: 'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!
తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది. కాలానికి ఆదిగా భావించే ఈ పర్వదినంతో కొత్త తెలుగు...
By Pagadala Venkateswar 2026-03-20 03:50:09 0 125
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:34:12 0 121
Andhra Pradesh
ఏసీబీ వలలో పడిన సచివాలయం విలేజ్ సర్వేయర్
*మచిలీపట్నం :*   ఎసీబీ వలలో పడ్డ సచివాలయం  విలేజ్ సర్వేయర్   14వేలు లంచం...
By Rajini Kumari 2026-02-01 11:56:15 0 158
Andhra Pradesh
NDA కూటమి ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలనకు ప్రజా దర్బార్ నిదర్శనం
ప్ర‌చుర‌ణార్థం 18-12-2025   ప్ర‌జాస్వామ్య పాల‌న‌కు...
By Rajini Kumari 2025-12-18 11:13:09 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com