రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు.

0
112

హెల్మెట్ లేని నేతలకు రెట్టింపు జరిమానా విధించాలని మంత్రి ఆదేశం

అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రత బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత‌

నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టీక‌ర‌ణ‌

హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు

నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన అనిత

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో 'సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం' నినాదంతో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

 

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వరకు జరిగిన ఈ బైక్ ర్యాలీలో మంత్రి అనిత మాట్లాడుతూ.. "లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనేవారు, ప్రాణాలను కాపాడే వెయ్యి రూపాయల హెల్మెట్‌ను కొని ధరించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలి" అని అన్నారు.  

 

ఈ సందర్భంగా తన పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను గుర్తుచేసుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. మన నియోజకవర్గంలో ఒకే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఇకనైనా మేల్కొని 'హెల్మెట్ ధరిద్దాం-సురక్షితంగా పయనిద్దాం' అనే నినాదాన్ని పాటిద్దాం. మన ప్రాణాలను, మన కుటుంబాల భవిష్యత్తును కాపాడుకుందాం" అని అనిత పిలుపునిచ్చారు. ర్యాలీలో భాగంగా ఆమె పలువురు వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజ్ శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి...
By Ponnala Srinivasrao 2026-05-09 04:49:25 0 134
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద...
By Chennaiah Kati 2026-06-14 07:03:02 0 92
Andhra Pradesh
చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.
అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో...
By Pagadala Venkateswar 2026-05-20 03:41:18 0 97
Business & Finance
Is a Provisional Patent Enough to Protect Your Idea?
A provisional patent application offers inventors an early filing date while giving them up to 12...
By Navya Sree 2026-07-09 06:13:31 0 66
Telangana
అమర్‌నాథ్‌కు నాంది.|
"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్." హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని...
By Sidhu Maroju 2026-06-29 08:47:51 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com