రాజకీయ నాయకులకు డబుల్ ఫైన్.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు.

0
62

హెల్మెట్ లేని నేతలకు రెట్టింపు జరిమానా విధించాలని మంత్రి ఆదేశం

అనకాపల్లి జిల్లాలో రోడ్డు భద్రత బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అనిత‌

నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టీక‌ర‌ణ‌

హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు పిలుపు

నియోజకవర్గంలో రోడ్డు ప్రమాద మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన అనిత

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాఫిక్ నిబంధనల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు భద్రత విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టగలమని ఆమె స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లాలో 'సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం' నినాదంతో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.

 

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వరకు జరిగిన ఈ బైక్ ర్యాలీలో మంత్రి అనిత మాట్లాడుతూ.. "లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనేవారు, ప్రాణాలను కాపాడే వెయ్యి రూపాయల హెల్మెట్‌ను కొని ధరించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం విలువను ప్రతి ఒక్కరూ గుర్తించాలి" అని అన్నారు.  

 

ఈ సందర్భంగా తన పాయకరావుపేట నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను గుర్తుచేసుకుని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. మన నియోజకవర్గంలో ఒకే నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాయి. ఇకనైనా మేల్కొని 'హెల్మెట్ ధరిద్దాం-సురక్షితంగా పయనిద్దాం' అనే నినాదాన్ని పాటిద్దాం. మన ప్రాణాలను, మన కుటుంబాల భవిష్యత్తును కాపాడుకుందాం" అని అనిత పిలుపునిచ్చారు. ర్యాలీలో భాగంగా ఆమె పలువురు వాహనదారులకు స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు.

Search
Categories
Read More
Karnataka
బెంగళూరు తొక్కిసలాటపై కర్ణాటక హైకోర్టు సుమోటో కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలపై ఫిర్యాదులు!
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన...
By Kanva Prasad 2025-06-05 09:28:26 0 3K
Andhra Pradesh
వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ వాయిదా.
AP: వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా? లేదా?.. ఉంటే ఎవరెవరిని విచారించాలో...
By Pagadala Venkateswar 2026-01-20 06:25:58 0 146
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సోలార్ కంచెను దాటలేక మరోవైపు తిరిగిన ఏనుగులు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు...
By Kothuru Murali 2026-04-08 07:31:45 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com