"బక్రీద్‌కు శాంతి బాట… అల్వాల్‌ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|

0
148

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై, మత పెద్దలు, స్థానిక నాయకులు, ప్రాంతీయ ప్రజలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ డీసీ భోగేశ్వర్లు మాట్లాడుతూ, పండుగలను సామరస్య వాతావరణంలో జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. 

బక్రీద్ సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు, అధికారులు పరస్పర సహకారంతో ముందుకు వెళితే ఎలాంటి సమస్యలు తలెత్తవని అన్నారు.

సమావేశంలో పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

మత సామరస్యాన్ని కాపాడుతూ పండుగను జరుపుకోవాలని, జంతు బలి నిర్వహణలో నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, శబ్ద కాలుష్య నియంత్రణ వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అనంతరం, ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే పండుగలు శాంతియుతంగా జరుగుతాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఎస్సైలు, తరుణ్ రెడ్డి,  రాఘవేందర్ రెడ్డి, దేవేందర్, మల్లేష్, గీత, ఏఎస్ఐ తులసిరామ్, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న మత పెద్దలు, ప్రజాప్రతినిధులు పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Punjab
The Digital Mandi: Revolutionizing Wheat Procurement
Punjab’s "Digital Mandi 2.0" platform hit a record today, processing 500,000 metric tons of...
By Dunna Jessicaruth 2026-05-14 08:28:06 0 36
Telangana
మళ్లీ అధికారంలోకి వస్తే హైడ్రాను తొలగిస్తూ తొలి సంతకం..కేసీఆర్
హైదరాబాద్‌లో హైడ్రాపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు ‎ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తీవ్ర విమర్శలు...
By Ponnala Srinivasrao 2026-04-21 01:46:20 0 80
Andhra Pradesh
వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి
ఎమ్మిగనూరు పట్టణంలోని 'కోతుల బావి' ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదానికి మున్సిపల్ కమిషనర్...
By Boya Dasthagiri 2026-05-19 09:13:43 0 59
Telangana
చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి|
మంచిర్యాల జిల్లా : చెన్నూర్ లో కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ...
By Avunoori Mahesh 2026-05-07 15:02:12 0 137
Andhra Pradesh
షాకింగ్... ఆన్‌లైన్‌లో చిరంజీవి కొత్త సినిమా HD ప్రింట్
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో విడుదలైన ‘మన శంకరవరప్రసాద్...
By Pagadala Venkateswar 2026-01-13 07:27:12 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com