Andhra Pradesh ex speaker duddilla sri pada rao 27th death anniversary
Posted 2026-04-13 13:02:36
0
362
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 27వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న నాయకుడు శ్రీపాదరావు గారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ వరకు అనేక పదవులకు వన్నె తెచ్చిన నాయకుడని కొనియాడారు. శాసనసభ ఔన్నత్యాన్ని పెంపొందిస్తూ సభను ఎంతో హుందాగా నడిపిన తీరు శ్లాఘనీయమని అన్నారు. శ్రీపాదరావు గారి జీవితం నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ... అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారనుందని ప్రపంచ బ్యాంక్...
నిరుద్యోగులకు శుభవార్త: ఏపీలో 529 వైద్య పోస్టుల భర్తీకి ప్రకటన.
ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి...
వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్మెంట్లు ఫుల్.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు
హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం...
ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
పాత బొబ్బిలి సరే పోలమ్మతల్లి గ్రామదేవత పండగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని...
రూ.2.08.కోట్ల విలువైన, దొంగలించిన 1,039 మొబైల్ ఫోన్ ల రికవరీ. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్...