"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|

0
202

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 

మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 

దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు కాల్పులకు తెగబడి సిబ్బందిని అదుపులోకి తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. 

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుల ఫోటోలను కరీంనగర్ పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.

పోస్టర్‌లో ఉన్న ఐదుగురు అనుమానితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ పోస్టర్‌లోని వివరాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అల్వాల్ పి‌ఎస్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

పోస్టర్‌లో కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సంప్రదింపు నంబర్లు కూడా ఇవ్వబడిన నేపథ్యంలో, నిందితుల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ఆ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు, లేక అత్యవసర నంబర్ 100కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

నిందితులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ప్రజల సహకారంతో ఈ సంచలన దోపిడీ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
International
War updates
ఇరాన్‌లోని 131 ప్రాంతాల్లో యూఎస్–ఇజ్రాయెల్ దాడులు.. 500 మందికి పైగా మృతి...
By G k Nookala 2026-03-02 18:59:00 0 99
Andhra Pradesh
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండగ 2.0 కు శ్రీకారం
*పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్లె పండుగ-2.0కు శ్రీకారం*   *గ్రామ సీమల అభ్యున్నతికి పవన్ కళ్యాణ్...
By Rajini Kumari 2026-01-02 12:31:21 0 191
Andhra Pradesh
మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు*  ...
By Rajini Kumari 2025-12-24 07:56:23 0 158
Andhra Pradesh
రైతులకు భూములు ఇవ్వండి.. పుంగనూరులో తహసీల్దార్ కు వినతి
పుంగనూరులో గత ప్రభుత్వంలో 5వేల కోట్లతో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అయితే,...
By Kothuru Murali 2026-05-22 14:31:28 0 34
Andhra Pradesh
పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
పుంగనూరు మండలం వనమలదిన్నెలో కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...
By Kothuru Murali 2026-03-20 05:45:29 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com