"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|

0
203

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 

మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 

దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు కాల్పులకు తెగబడి సిబ్బందిని అదుపులోకి తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. 

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుల ఫోటోలను కరీంనగర్ పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.

పోస్టర్‌లో ఉన్న ఐదుగురు అనుమానితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ పోస్టర్‌లోని వివరాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అల్వాల్ పి‌ఎస్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

పోస్టర్‌లో కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సంప్రదింపు నంబర్లు కూడా ఇవ్వబడిన నేపథ్యంలో, నిందితుల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ఆ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు, లేక అత్యవసర నంబర్ 100కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

నిందితులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ప్రజల సహకారంతో ఈ సంచలన దోపిడీ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్m
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-28 11:17:59 0 126
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జరిగిన గొల్లపూడి అయ్యప్ప స్వామి వేడుకలు
విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడి వాసులు అంగరంగ వైభవంగా కోలాటాల...
By Rajini Kumari 2025-12-27 14:57:30 0 185
Andhra Pradesh
Anil Kumar Singhal: టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ... రవిచంద్రకు బాధ్యతలు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌పై బదిలీ వేటు  సీఎం ముఖ్య కార్యదర్శి రవిచంద్రకు అదనపు...
By Pagadala Venkateswar 2026-02-01 10:51:44 0 127
Andhra Pradesh
విజయనగరం RDOగా సుధాసాగర్
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్...
By Boiena Rajesh 2026-03-17 13:13:58 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com