కేసీఆర్‌ భయం.. రెండో విడత పెట్టుబడి సాయం..!

0
82

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

‎రైతుభరోసా పంపిణీ చేయకపోవడంపై కచ్చితంగా కేసీఆర్‌ ఈ సభ సాక్షిగా ప్రశ్నిస్తారని, రైతుల తరఫున నిలదీస్తారని రేవంత్‌ సర్కార్‌కు అవగతమైంది. దీంతో నిన్నమొన్నటి దాకా నిధులే లేవంటూ రైతుభరోసా రెండో విడతను వాయిదావేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేసీఆర్‌ సభ రోజే పంపిణీ చేయాలని నిర్ణయించింది. జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించే బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిధులు విడుదల చేస్తారని అధికారులు ప్రకటించారు. మొత్తం 45.11 లక్షల మంది రైతులకు రూ.2,063 కోట్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు

Search
Categories
Read More
Telangana
వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు
సైబరాబాద్‌(Cyberabad) పరిధిలోని పలు స్టార్‌ హోటళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాగా...
By Vadla Egonda 2025-06-19 10:19:08 0 1K
Andhra Pradesh
శ్రీశైలం ఘాట్ రహదారులో తప్పిన పెను ప్రమాదం
శ్రీశైలం ఘాట్ రహదారిలో తప్పిన పెను ప్రమాదం   అదుపుతప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లిన...
By Rajini Kumari 2025-12-15 07:28:14 0 200
Andhra Pradesh
వైయస్సార్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : ఎమ్మెల్యే బీవీ
కర్నూలు : కర్నూలు సిటీ :  వైసీపీని చూసి నవ్వుకుంటున్నారు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే...
By Hari Krishna 2026-01-08 08:16:05 0 156
Prop News
PROPIINN Uncovers the Real Story Behind Every Property
Before You Buy, Know the Ground Because every property has a story—PROPIINN helps you read...
By Bharat Aawaz 2025-06-26 05:45:12 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com