క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా చర్చ్ ల ముస్తాబు.|

0
181

సికింద్రాబాద్  : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. గంటల వ్యవధిలో వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రైస్తవ సోదరులు షాపింగ్ ల తో బిజీ బిజీగా మారిపోయారు.

ముఖ్యంగా ఈ రోజు కోసం వారు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారని చెప్పడంలో ఎటువంటి అతిశకయోక్తి లేదు.

 క్రిస్మస్ పండుగకు ఒక రోజు ముందుగా అనగా నేటి రాత్రి 11గంటలకే తమ తమ చర్చిలు వద్దకు చేరుకొని ప్రార్థనలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తెలుతారు. ఒకరికొకరు కరచాలనం, ఆలింగనాలూ చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొని అర్ధరాత్రి 12 గంటల తరువాత తమతమ నివాసాల వద్దకు వెళ్లి ఇళ్లముందు రంగురంగుల హరివిల్లులతో అందంగా తీర్చిదిద్దుతారు.

ముఖ్యంగా క్రైస్తవులంతా దాదాపు 10 రోజుల ముందునుండే ఇళ్ల వద్ద స్టార్ (విద్యుత్ దీపాల నక్షత్రాన్ని) ఏర్పాటు చేసుకొని ప్రతి రోజు రాత్రుళ్లు తమతమ చర్చిల సభ్యుల ఇళ్ళవద్దకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. ఇవి డిసెంబర్ 31వరకు కొనసాగిస్తారు.

సర్వమానవ సౌబ్రాతృత్వం, శాంతిని కాంక్షిస్తూ దేవదేవుడ్ని ప్రార్థిస్తామని క్రైస్తవ ప్రతినిధులు, పాస్టర్లు తెలిపారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...
By Sadaq Sadaq 2026-03-02 14:40:30 0 119
Telangana
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే౹*   *సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే॥*  ...
By Ponnala Srinivasrao 2026-03-27 03:19:15 0 170
Telangana
తెలంగాణలో చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చేసిన కాంగ్రెస్ ఇసుక మాఫియా!
ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు.   చెక్ డ్యామ్‌లకు డ్రిల్లింగ్స్ తో జెలటిన్ స్టిక్స్...
By Prashanth Goindla 2025-12-23 07:12:23 0 318
Andhra Pradesh
ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-05-05 06:37:59 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com