"జగన్నాథ రథయాత్ర" లో మర్రి దంపతుల సేవాభావం.|

0
51

"ప్రత్యేక పూజలతో పాటు ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే దంపతులు"

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 16: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన సతీమణి మమతా రెడ్డి తో కలిసి అల్వాల్‌లోని సుమారు 400 ఏళ్ల చారిత్రక శ్రీ జగదీప్ మందిర్‌లో నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం సేవాభావానికి ప్రతీకగా ఆలయ ప్రాంగణాన్ని స్వయంగా చీపురుతో శుభ్రం చేశారు. తర్వాత పల్లకి సేవలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారిని రథం వద్దకు తీసుకువచ్చి, వేద మంత్రోచ్చారణల నడుమ రథయాత్రను ప్రారంభించారు.

రథయాత్ర అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన ఎమ్మెల్యే దంపతులు ఆలయ అర్చకులు, నిర్వాహక కమిటీ సభ్యులను అభినందించారు.

శ్రీ జగన్నాథ స్వామి వారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు మహంతి నారాయణదాసు, టింకు జగదీష్ ఫారిక్, సూరత్ సింగ్, ఆర్.సి. సింగ్, నర్సింగ్, గోపాల్ సింగ్, బీఆర్ఎస్ నాయకుడు తోట నరేందర్ రెడ్డి, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
International
In Dubai all airports are closed due to the war
దుబాయ్‌లో అన్ని విమానాశ్రయాలు మూసివేత ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు రావొద్దని...
By G k Nookala 2026-02-28 14:53:03 0 348
Telangana
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
By Pinnehasan Odela 2026-01-14 18:15:27 0 204
Andhra Pradesh
గంగమ్మ తల్లికి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడు కట్టిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి సతీమణి హరితమ్మ
రాయచోటి మైనార్టీ టీడీపీ నాయకుడు షామియానా రహంతుల్లా కఠిన చాందిని బండిని ప్రారంభించిన మంత్రి...
By Benguluri Madhubabu 2026-02-25 06:58:53 0 331
Telangana
పెద్దపల్లి : మాజీ MLA పుట్ట మధుకు 900 కోట్ల అక్రమాస్తులు...!
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత  బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని...
By Sunka Santhosh 2026-06-22 10:25:37 0 158
Telangana
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
డ్రగ్స్‌కు 'నో'... ఆరోగ్యకరమైన జీవితానికి 'యెస్' చెప్పండి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
By Pinnehasan Odela 2026-06-26 13:45:39 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com