లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.

0
108

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం

అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు

మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలే కారణమన్న సీఎం చంద్రబాబు

ఇది మహిళలకు చేసిన ద్రోహమని వ్యాఖ్య

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.

 

వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ అవసరం కాగా, ఆ మార్కును అందుకోకపోవడంతో బిల్లు వీగిపోయింది. 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ పరిణామంపై ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, మహిళా సాధికారతకు అడ్డుపడిన ప్రతిపక్షాల వైఖరిని ఆయన తప్పుబట్టారు. వారి చర్యల వల్ల దేశం ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు...
By Pagadala Venkateswar 2026-04-07 03:58:25 0 139
Bharat Aawaz
Your Right, Their Wrong: Why Every Citizen Must Rise Today
In a country where the Constitution promises justice, liberty, and dignity, a heartbreaking...
By Citizen Rights Council 2025-07-17 13:20:56 0 2K
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
మోడీ సర్కార్ పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని ఎమ్మిగనూరు CPIపట్టణ సమితి...
By Boya Dasthagiri 2026-05-16 10:01:26 0 164
Telangana
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు- ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ.|
హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఇకపై...
By Sidhu Maroju 2026-03-06 17:53:45 0 174
Telangana
పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్న జనాలు
ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు...
By Veeresh Kumar 2026-03-24 17:52:33 0 346
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com