Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత.

0
103

 

 

Vangalapudi Anita: వెంకటగిరి విద్యార్థినుల నిజాయతీ నన్ను గర్వపడేలా చేసింది: హోంమంత్రి అనిత

06-03-2026 Fri 14:28 | Andhra

 

Vangalapudi Anita Praises Venkatagiri Students Honesty

వెంకటగిరి జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థినుల నిజాయతీ

బంగారం, నగదు ఉన్న పర్సును పోలీసులకు అప్పగించిన వైనం

చిన్న వయసులోనే గొప్ప నైతిక విలువలు చాటారని మంత్రి ప్రశంస

పిల్లలను గొప్పగా పెంచిన తల్లిదండ్రులు, గురువులకు కృతజ్ఞతలు

తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రదర్శించిన నిజాయతీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సంతోషం వ్యక్తం చేస్తూ, వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. నేటి కాలంలో నైతిక విలువలు కనుమరుగవుతున్న తరుణంలో, ఈ విద్యార్థినులు ఆదర్శంగా నిలిచారని ఆమె కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

 

"వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు చూపిన నిజాయతీ నన్ను ఎంతగానో గర్వపడేలా చేసింది. బి.గురుప్రియ, బి.గీతిక, ఎం.గీతిక, పద్మశ్రీ, మరియు హేమలత అనే విద్యార్థులు. తమకు దొరికిన బంగారం, నగదుతో కూడిన పర్సును వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ స్వరూప గారికి అప్పగించి తమ నైతిక విలువలను చాటుకున్నారు. చిన్న వయసులోనే ఇంతటి నీతివంతమైన ప్రవర్తనతో మంచి చేసిన విద్యార్థినులకు హృదయపూర్వక అభినందనలు. బాధితురాలికి ఆ నగలను చేరవేసి ఆదర్శంగా నిలిచిన ఈ చిట్టితల్లులకు అభినందనలు. మీ నిజాయితీ మరెందరికో స్ఫూర్తి కావాలిన ఆకాంక్షిస్తున్నాను. ఇంతటి మంచి విలువలతో పెంచిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పని గురువులకు నా ధన్యవాదాలు" అంటూ అనిత తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ఈ విద్యార్థినులను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా ప్రశంసించారు. "మా అమ్మాయిలు బంగారం" అని కొనియాడారు.

 

ఏం జరిగిందంటే...

 

గురువారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్ట‌గా వెంక‌ట‌గిరి ఎస్బీఐ బ్యాంకు వ‌ద్ద మ‌న్న‌వ‌రం బ‌స్సు కోసం నిరీక్షిస్తున్న‌ కొత్త‌ప‌ల్లి గుంటకు చెందిన 8వ త‌ర‌గ‌తి విద్యార్థినులు బి.గురుప్రియ, బి.గీతిక, ఎం.గీతిక, 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ప‌ద్మ‌శ్రీ , 7వ త‌ర‌గ‌తి విద్యార్థిని హేమ‌ల‌తల‌కు ఒక ప‌ర్సు క‌నిపించింది. ప‌ర్సు తీసి చూడ‌గా బంగారం, న‌గ‌దు. దాంతో ఆ అమ్మాయిలు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లారు. త‌మ‌కు దొరికిన ప‌ర్సును ఎస్ఐ స్వ‌రూప‌కు అంద‌జేసి, అభినంద‌న‌లు అందుకుని ఇంటికెళ్లేందుకు బ‌స్టాప్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. అక్క‌డ ఓ మ‌హిళ ప‌ర్సు కోసం వెతుకుతూ పిల్ల‌ల్ని అడిగింది. త‌మ‌కే దొరికింద‌ని, స్టేష‌న్‌లో ఇచ్చామ‌ని చెబుతూ ఆమెతో పాటు స్టేష‌న్‌కు వెళ్లారు పిల్ల‌లు. న‌గ‌లు, న‌గ‌దు ఆమెవేన‌ని నిర్ధారించుకున్న ఎస్ఐ ఆ మ‌హిళ‌కు అంద‌జేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు.
  పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు  Andhra...
By Pagadala Venkateswar 2026-04-20 03:42:14 0 68
Andhra Pradesh
ఆర్టీసీ చార్జీలు పెంచభూమన్న మంత్రి మండి పల్లి
AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం...
By Pagadala Venkateswar 2026-01-13 07:38:02 0 155
Andhra Pradesh
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
By Pagadala Venkateswar 2026-02-03 13:12:11 0 109
Telangana
ఖమ్మం జిల్లాలో రేపు సీఎం పర్యటన...
ఖమ్మం జిల్లాలో సీపీఐ పార్టీ శత వసంతాల ముగింపు సభలో పాల్గొననున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...
By Krishna Balina 2026-01-17 09:44:50 0 366
Telangana
నిజామాబాద్: సిఎంఆర్ఎఫ్ చెకులపంపిని
నిజామాబాద్.ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే క్యంప్ కార్యాలయంలో లాబ్డిదారులకు సిఎంఆర్ఎఫ్ చెకులు అందజేయడం...
By Sadaq Sadaq 2026-03-22 15:35:54 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com