"బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|

0
287

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు. డీసీపీ చౌ. శ్రీధర్ ఐపీఎస్ నేతృత్వంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

ఈ మెరుపు దాడుల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 100 ఆక్సిటోసిన్ బాటిల్స్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మరియు ఒక హుక్కా పాట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల అనంతరం అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచేందుకు, డ్రగ్స్ మరియు ఇతర చట్టవిరుద్ధ పనులను అరికట్టేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు. 

స్థానిక పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ
 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా...
By Bheeshman King 2025-12-22 16:41:55 0 373
Andhra Pradesh
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపు
సామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా...
By Ratna Sekhar 2026-02-19 19:31:08 0 890
Telangana
డబ్బా కోట్లను తొలగించవద్దు.
చిలుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-05-09 09:39:22 0 121
Karnataka
Implementation of On-Street Parking Fees in Bengaluru
The Directorate of Urban Land Transport (DULT) and the Bruhat Bengaluru Mahanagara Palike (BBMP)...
By Venugopal Gopal 2026-01-04 17:20:00 0 859
Andhra Pradesh
అర్ధరాత్రి పరామర్శ హోమ్ మినిస్టర్ అనిత
*కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత*   *కార్యకర్త ఫోన్...
By Rajini Kumari 2026-01-05 11:53:18 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com