"బోయిన్‌పల్లి పరిధిలో డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ కార్డన్ సెర్చ్.|

0
174

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మల్కాజిగిరి జోన్ పోలీసులు మంగళవారం భారీ తనిఖీలు చేపట్టారు. డీసీపీ చౌ. శ్రీధర్ ఐపీఎస్ నేతృత్వంలో సుమారు 300 మంది పోలీసు సిబ్బంది బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్‌పేట్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు.

ఈ మెరుపు దాడుల్లో సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 100 ఆక్సిటోసిన్ బాటిల్స్, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మరియు ఒక హుక్కా పాట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల అనంతరం అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక శక్తులపై నిఘా ఉంచేందుకు, డ్రగ్స్ మరియు ఇతర చట్టవిరుద్ధ పనులను అరికట్టేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు. 

స్థానిక పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రపంచ క్లీన్ ఎనర్జీలో ఏపీకి అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
Andhra   Chandrababu Naidu AP to Become Global Clean Energy Hub కాకినాడలో ఏఎం గ్రీన్...
By Pagadala Venkateswar 2026-01-17 11:13:38 0 148
Telangana
పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు
మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న...
By Avunoori Mahesh 2026-04-08 07:20:54 0 194
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ 62వ డివిజన్లో 43 లక్షలతో ఉద్యానవనం ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ  27-12-2025       *ఈ పార్క్ ప్రజలది దీన్ని...
By Rajini Kumari 2025-12-27 10:35:03 0 278
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ డే సందర్భంగా పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *ది.26.12.2025* _*// "పోలీస్ గ్రీవెన్స్ డే"లో పోలీస్ సిబ్బంది వినతులు...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:49:51 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com