డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం*

0
30

విశాఖకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్థుల అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం

బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ పరిధిలోని చీరాల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన భారీ సైబర్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. “డిజిటల్ అరెస్ట్” పేరుతో భయపెట్టి రూ.26.50 లక్షలు కాజేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన ముగ్గురు సైబర్ నేరస్థులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కేసుకు సంబంధించిన వివరాలను చీరాల సబ్ డివిజన్ అధికారి ఎం.డి. మొయిన్ మీడియాకు వెల్లడించారు. కొత్తపేట గ్రామానికి చెందిన కె. మోహన్ రావును సోషల్ మీడియా ద్వారా సంప్రదించిన నిందితులు, తమను పోలీసులమని పరిచయం చేసుకుని అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని నమ్మబలికి విడతల వారీగా రూ.26.50 లక్షలు మోసపూరితంగా వసూలు చేశారు.

బాధితుడు మార్చి 30, 2026న చీరాల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు Cr.No.43/2026గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4) మరియు ఐటీ యాక్ట్ 66(D) కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల వరుసగా జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ తరహా సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును పోలీసులు సవాలుగా స్వీకరించారు. చీరాల సబ్ డివిజన్ అధికారి ఎం.డి. మొయిన్ పర్యవేక్షణలో, బాపట్ల ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలోని టెక్నికల్ బృందం అందించిన సమాచారంతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.

చీరాల II టౌన్ సీఐ ఏ. శశికుమార్ నాయకత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని విశాఖపట్నానికి పంపించారు. అక్కడ నిందితుడు నాగ ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ.8 లక్షలు, మరో నిందితుడు నీల్ కుమార్ వద్ద నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బొందలపు గోవిందు ఖాతాకు రూ.14 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. మొత్తం మూడు ఖాతాలకు రూ.26.50 లక్షలు బదిలీ అయినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ కేసులో ఇప్పటివరకు రూ.10 లక్షలు రికవరీ చేశామని, మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.

ప్రజలను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ “డిజిటల్ అరెస్ట్” అనే ప్రక్రియ అసలు లేదని, అపరిచితుల బెదిరింపులకు భయపడి డబ్బులు పంపవద్దని హెచ్చరించారు. సైబర్ నేరస్థులు కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇలాంటి మోసాలపై పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.

కేసు చేదనలో విశేష కృషి చేసిన పోలీస్ సిబ్బందిలో ఇన్స్పెక్టర్ ఏ. శశికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ కె. మురళి, హెడ్ కానిస్టేబుల్ జి. మల్లేష్, పోలీస్ కానిస్టేబుళ్లు ఎస్‌కే నాగూర్, ఎం. శ్రీనివాస్, టీ. బాలాజీ, సీహెచ్ రాజేష్, ఎస్. ఆంజనేయులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేప‌ల్లి లోని వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా వ‌డ్డె ఓబ‌న్న జ‌యంతి కార్య‌క్ర‌మం.
తాడేప‌ల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాల‌వాడ నర‌సింహారెడ్డికి...
By John Baji 2026-01-12 04:32:34 0 153
Telangana
తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ నీటి వివాదం: శ్రీశైలం ప్రాజెక్టుపై భట్టి విక్రమార్క హెచ్చరిక
నీటి వివాదం: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య శ్రీశైలం రిజర్వాయర్ నీటి వాటాపై ఉద్రిక్తతలు...
By Triveni Yarragadda 2025-08-11 14:15:02 0 1K
Andhra Pradesh
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన
గుంటూరు ఫిబ్రవరి 4: గుంటూరు నగరంలోని కె.వి.పి కాలనీలో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను జిల్లా...
By John Baji 2026-02-04 15:15:25 0 376
Andhra Pradesh
మిర్చి రైతులకు అండగా నిలవాలి.
మిర్చి యార్డుకు వచ్చే రైతులకు అండగా నిలుస్తూ, భరోసా కల్పించడమే లక్ష్యం కావాలని మిర్చి యార్డు వైస్...
By John Baji 2026-02-05 08:47:12 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com