"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|

0
362

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు రోడ్డు నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన అంశమని, మద్యం సేవించి వాహనం నడపడం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అధిక వేగం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణతోనే ప్రాణ నష్టాలను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలని, డ్రైవర్లు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా స్కూల్ జోన్‌లలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు.

కార్యక్రమం చివరలో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో పాల్గొన్న ప్రజలతో రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు బాధ్యతగా వ్యవహరిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువత పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పొందారు. అధికారులు సూచించిన నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

👉 జాగ్రత్తగా డ్రైవ్ చేయండి – సురక్షితంగా గమ్యం చేరండి!

#Sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా అయితే జాగ్రత్త :: కర్నూలు ఇంచార్జి ఎస్పీ
కర్నూలు : కర్నూలు సిటీ కర్నూలు జిల్లా...సంక్రాంతికి ఊరెళ్తున్నారా? .విలువైన వస్తువులు ...
By Hari Krishna 2026-01-07 10:28:49 0 271
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:41 0 158
Telangana
"ఖుల్లం-ఖుల్లా"
ఇప్పుడు అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "WWE గేమ్" రాజకీయాలే చేస్తున్నారు ! ‎"నీవు కొట్టినట్లు...
By Ponnala Srinivasrao 2026-04-04 01:43:54 0 176
Andhra Pradesh
పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో...
By Kothuru Murali 2026-01-01 12:25:40 0 155
Andhra Pradesh
Chandrababu Naidu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.
Andhra Chandrababu Naidu Serious on Rajahmundry Adulterated Milk Incident రాజమండ్రి కల్తీ పాల...
By Pagadala Venkateswar 2026-02-23 10:20:03 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com