"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|

0
361

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు రోడ్డు నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన అంశమని, మద్యం సేవించి వాహనం నడపడం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అధిక వేగం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణతోనే ప్రాణ నష్టాలను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలని, డ్రైవర్లు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా స్కూల్ జోన్‌లలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు.

కార్యక్రమం చివరలో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో పాల్గొన్న ప్రజలతో రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు బాధ్యతగా వ్యవహరిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువత పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పొందారు. అధికారులు సూచించిన నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

👉 జాగ్రత్తగా డ్రైవ్ చేయండి – సురక్షితంగా గమ్యం చేరండి!

#Sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-25 12:02:46 0 144
Andhra Pradesh
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా...
By John Baji 2026-02-11 05:54:56 0 293
Andhra Pradesh
అమరావతికి మరో శుభవార్త అందించిన కేంద్రం..
రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతిలో రూ.80...
By John Baji 2025-12-27 11:28:46 0 157
Andhra Pradesh
ఉపాధి వేతనదారులకు రూ.307 అందేలా చూడాలి: డ్వామా పీడీ
ఉపాధి వేతనదారులకు కనీస వేతనం రూ.307 అందేలా చూడాలని డ్వామా పీడీ కె.శారదాదేవి అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-05 14:08:24 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com