సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
189

సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని, "బొగ్గు గనుల్లో అగ్గి మండిస్తాం” అని హెచ్చరించారు. సింగరేణిలో అంతా అవినీతిమయంగా మారిందన్నారు, ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి చెబితేనే అక్కడ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సిట్ (SIT) లేదా ఏసీబీ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. ఇచ్చిన ఉద్యోగాలపై ఏసీబీ విచారణ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని ఇక్కడ విచారణ చేయాల్సింది సింగరేణి అవినీతి మీదన్నారు. ఏసీబీ విచారణకు భయపడేది లేదన్నారు. "గాడిదలకు గడ్డేసి.. ఆవుకు పాలు వస్తాయా సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం తమ్ముళ్లు తమను అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల గల్లా పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్, జాన్సన్ నాయక్, బోడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రం: బండరాయిని ఢీకొన్న బైక్ వ్యక్తికి గాయాలు.
రామసముద్రం - పుంగనూరు రహదారిలోని గాంధీనగర్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక బైక్ అదుపుతప్పి రహదారి...
By Pagadala Venkateswar 2026-02-17 05:23:47 0 164
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు...
By Benguluri Madhubabu 2026-05-28 12:57:06 0 164
Telangana
మజ్జిగ మరియు ఓరేస్ ప్యాకెట్లు పంపిణీ గ్రామ సర్పంచ్...
మర్రిపల్లి/దుగ్గొండి    మజ్జిగ మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించిన గ్రామ సర్పంచ్ డ్యాగం...
By Gujile Ramu 2026-06-03 07:40:23 0 161
Telangana
తన గురువు డా. జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల కేసీఆర్ సంతాపం.
తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి...
By Ponnala Srinivasrao 2026-03-28 01:52:43 0 206
Andhra Pradesh
మదనపల్లి: పోలీసుల ఆరోగ్యంపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.
మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...
By Pagadala Venkateswar 2026-05-22 05:09:26 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com