సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

0
160

సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని, "బొగ్గు గనుల్లో అగ్గి మండిస్తాం” అని హెచ్చరించారు. సింగరేణిలో అంతా అవినీతిమయంగా మారిందన్నారు, ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి చెబితేనే అక్కడ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సిట్ (SIT) లేదా ఏసీబీ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. ఇచ్చిన ఉద్యోగాలపై ఏసీబీ విచారణ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని ఇక్కడ విచారణ చేయాల్సింది సింగరేణి అవినీతి మీదన్నారు. ఏసీబీ విచారణకు భయపడేది లేదన్నారు. "గాడిదలకు గడ్డేసి.. ఆవుకు పాలు వస్తాయా సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం తమ్ముళ్లు తమను అడుగుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం కోసం స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల గల్లా పట్టుకుని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, రాష్ట్ర నాయకులు విజిత్ రావు, టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్, జాన్సన్ నాయక్, బోడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
"సాంకేతికత అంటే పాశ్చాత్య దేశాలకే పరిమితమని ఎవరు అన్నారో? మనదేశంలోనే 2000 ఏళ్ల క్రితమే ‘నీటితో నడిచే ఘడియారం’ ఉండేదని తెలుసా?"
"2000 ఏళ్ల క్రితమే నీటితో నడిచిన ఘడియారం – భారత విజ్ఞాన శక్తికి ఇది నిదర్శనం!" సూర్య...
By Bharat Aawaz 2025-08-03 18:32:08 0 761
Telangana
పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి...
By Sunka Santhosh 2026-04-27 19:23:50 0 156
Telangana
BRS మండల నాయకులను పరామర్శించిన కేటీఆర్
ఖమ్మం జిల్లా BRS కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల...
By Krishna Balina 2026-01-08 09:25:04 0 197
Andhra Pradesh
AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత...
By Pagadala Venkateswar 2026-01-28 10:35:33 0 114
Andhra Pradesh
రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ఉల్లి పంట సాగు చేసి పండించిన రైతు కు కన్నీరే మిగిలింది. ఇది మన గూడూరులో చోటు చేసుకుంది
భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకదాటి వర్షానికి నేలకొరిగాయి . గత...
By mahaboob basha 2025-08-15 00:56:15 0 648
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com