జాబ్ ఇస్తామంటూ యువకుడిని మోసం చేసిన సైబర్ గ్యాంగ్.|

0
97

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ పరిధిలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్ పేరుతో యువకుడిని మోసం చేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకున్నారు.

08-04-2026 మధ్యాహ్నం 3:00 గంటలకు హిమాన్షు వినోద్ బిహాని (వయసు 24 సంవత్సరాలు), స్వయం ఉపాధి, భూపతిరావు నగర్, అల్వాల్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 06-04-2026 ఉదయం 11:48 గంటల నుండి మధ్యాహ్నం 2:50 గంటల మధ్యలో 7428461371 నంబర్ నుండి కాల్ వచ్చి, ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్‌కు ఎంపికయ్యారని నమ్మించారు. 

స్మార్ట్ బోర్డ్, ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్ పంపిస్తామని చెప్పి ముందుగా ఒక కన్ఫర్మేషన్ అమౌంట్ చెల్లించాలని కోరారు. చెల్లించిన డబ్బును తిరిగి రీఫండ్ చేస్తామని చెప్పడంతో నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,324/-ను 7 విడతలుగా UPI (QR) ద్వారా పంపించాడు.

తర్వాత ఇది మోసం అని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయగా, 33704260014762 అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ పొందారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు హెచ్చరిస్తున్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని ప్రోత్సహించాలని, హాస్పిటల్ సిబ్బందిని జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె.పరంధామ రెడ్డి కోరారు.
చీరాల : రోడ్డు ప్రమాద బాదితులకు సహాయం చేసేవారిని ఇబ్బందులకు గురిచెయ్యకుండా, వారిని...
By Gadiyapudi Narendra 2026-01-19 14:59:07 0 153
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 215
Andhra Pradesh
ఆర్టీసీ కాంప్లెక్స్లు ఆహ్లాదకరంగా ఉండాలి
పార్వతిపురం జిల్లాలో గల అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రయాణికులకు అన్ని మౌలిక...
By Boiena Rajesh 2026-03-26 14:37:49 0 126
Andhra Pradesh
శివాలయంలో స్టోరీ
పుంగనూరు: కట్టకింద శివాలయంల ో సీస ీ కెమెరాలు ధ్వంసం చేస ి చోరీక ి పాల్పడిన గుర్తు తెలియని...
By Kothuru Murali 2025-12-27 17:26:22 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com