వృద్ధాశ్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భారీ విరాళం – రూ.50 లక్షల మంజూరు

0
495

కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సామాజిక సేవలో మరో ముందడుగు వేశారు. పెద్దాపురం మహారాణి కళాశాల ఎదురుగా నిర్మాణంలో ఉన్న ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని వివరంగా తెలుసుకుని, అవసరమైన సదుపాయాలపై సంబంధిత బాధ్యులతో చర్చించారు.

ఈ సందర్భంగా వృద్ధాశ్రమ భవన నిర్మాణానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. వృద్ధుల సంరక్షణకు అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలతో ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

సమాజంలో నిరాశ్రయ వృద్ధులకు భరోసా కలిగించే స్థావరంగా ‘ప్రశాంత నిలయం’ నిలవాలని ఆకాంక్షించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి వృద్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు, దాతలు కూడా ఈ సేవా కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

స్థానిక నాయకులు, సేవా సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మంజూరు చేసిన నిధులతో వృద్ధాశ్రమ నిర్మాణం వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 2K
Andhra Pradesh
అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టా? వాస్తవాలు - అపోహలు....
సమాజంలో జరిగే విషయాలను సేకరించి, విశ్లేషించి ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రతి వ్యక్తీ జర్నలిస్టే....
By Gadiyapudi Narendra 2026-03-03 05:44:11 0 160
Andhra Pradesh
ఇంద్రకీలాతి కేశఖండనశాల వేలం ప్రక్రియ పూర్తి 80% మేరకు పెరిగిన ఆదాయం
*ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన...
By Rajini Kumari 2025-12-29 13:18:43 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com