వృద్ధాశ్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భారీ విరాళం – రూ.50 లక్షల మంజూరు

0
499

కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సామాజిక సేవలో మరో ముందడుగు వేశారు. పెద్దాపురం మహారాణి కళాశాల ఎదురుగా నిర్మాణంలో ఉన్న ‘ప్రశాంత నిలయం’ వృద్ధాశ్రమ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని వివరంగా తెలుసుకుని, అవసరమైన సదుపాయాలపై సంబంధిత బాధ్యులతో చర్చించారు.

ఈ సందర్భంగా వృద్ధాశ్రమ భవన నిర్మాణానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ ప్రకటించారు. వృద్ధుల సంరక్షణకు అవసరమైన అన్ని ఆధునిక సదుపాయాలతో ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

సమాజంలో నిరాశ్రయ వృద్ధులకు భరోసా కలిగించే స్థావరంగా ‘ప్రశాంత నిలయం’ నిలవాలని ఆకాంక్షించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి వృద్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు, దాతలు కూడా ఈ సేవా కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

స్థానిక నాయకులు, సేవా సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మంజూరు చేసిన నిధులతో వృద్ధాశ్రమ నిర్మాణం వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా : MLC.శంబిపూర్ రాజు.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ...
By Sidhu Maroju 2025-12-28 10:01:22 0 152
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష...
By Kothuru Murali 2026-03-20 06:13:05 0 88
Andhra Pradesh
ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాలి
ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని...
By Boiena Rajesh 2026-03-03 12:56:23 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com