క్యూ పాటించమన్నందుకు ఇంత కక్షా? అల్వాల్‌లో కలకలం!

0
220

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి కంటిపై తీవ్ర గాయానికి దారితీసింది. బాధితుడు నిశాని జితేందర్ అందించిన వివరాల ప్రకారం ఘటన ఇలా ఉంది.

మచ్చబొల్లారం, కొత్తబస్తీకి చెందిన నిశాని జితేందర్ (21), తన తండ్రి శ్రీపతి మరియు తమ్ముడితో కలిసి తమ ప్యాసింజర్ ఆటో (TS10UB5761)లో గ్యాస్ నింపుకోవడానికి కనాజిగూడలోని అల్వాల్ పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఆటోను క్యూలో నిలిపి ఉంచగా, జితేందర్ తండ్రి భోజనం కోసం సమీపంలోని హోటల్‌కు వెళ్లారు.

మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నంబర్ ప్లేట్ లేని ఒక ఆటో క్యూ పద్ధతిని పాటించకుండా మధ్యలోకి దూసుకువచ్చింది. దీనిని ప్రశ్నించిన జితేందర్‌పై ఆ ఆటోలో వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగారు.

ఈ క్రమంలో ఒక నిందితుడు పదునైన ఆయుధంతో జితేందర్ ఎడమ కంటిపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. గొడవను ఆపడానికి ప్రయత్నించిన జితేందర్ తండ్రి శ్రీపతిపై కూడా వారు దాడి చేశారు.

బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం జి.ఎన్.ఆర్ (GNR) ఆసుపత్రికి తరలించారు. 

జితేందర్ ఎడమ కంటికి వైద్యులు నాలుగు కుట్లు వేశారు. ఎటువంటి కారణం లేకుండా తమపై దాడి చేసిన గుర్తు తెలియని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని...
By Gujile Ramu 2026-05-27 04:23:07 0 128
Andhra Pradesh
రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
రాయచోటి నియోజకవర్గం. రామాపురం మండలం. (16-03-2026)   రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన...
By Benguluri Madhubabu 2026-03-17 07:35:28 0 192
Telangana
ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు : రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్
మంచిర్యాల నియోజకవర్గం : శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సమావేశంలో ,ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సీఐటీయు...
By Avunoori Mahesh 2026-04-08 11:38:50 0 237
Telangana
బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:59:46 0 265
Andhra Pradesh
ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్.
ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య...
By Pagadala Venkateswar 2026-06-16 13:22:38 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com