శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|

0
98

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ నుంచి వెళ్లి ఐదేళ్లు అయినప్పటికీ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు” అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనను టిఆర్ఎస్ పార్టీ నుంచి పంపించడం తప్పు అని ప్రజల్లో చర్చ జరుగుతోందని, తాను ఎప్పుడూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో తనపై అన్యాయాలు జరిగాయని, భూములు, ఆస్తులపై ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, అబద్ధాలపై పాలన కొనసాగుతోందని అన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 12:06:03 0 81
Life Style
👗 Fashion & Celebrity Style Priyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch
👗 Fashion & Celebrity StylePriyanka Chopra Shines Bright at Bvlgari Collection Launch Global...
By BMA ADMIN 2025-05-23 09:36:58 0 3K
Andhra Pradesh
వి శాఖ లో లోకా యుక్త
విశాఖ పట్నం  జిల్లా పరిషత్  కార్య లయం లో .లోకా యుక్త కార్య క్రమం  న కు విశేష...
By Mobbu Venkatramana 2026-01-29 15:44:54 0 454
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com