ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి: నివాళులర్పించిన ఇంచార్జ్ జేసి.

0
193

మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ, శ్రీరాముని చరిత్రను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళమైన తెలుగులో రచించిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. ఇంచార్జ్ బీసీ సంక్షేమ అధికారి తేజస్విని మాట్లాడుతూ, మొల్ల కేవలం ఐదు రోజుల్లోనే 871 పద్యాలతో కూడిన రామాయణాన్ని రచించారని గుర్తుచేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి టమోటా మార్కెట్లో పతనం దిశగా ధరలు
మదనపల్లెలో టమోటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తున్నాయి ఆదివారం మార్కెట్ కు 1630 మెట్రిక్ టన్నులు...
By Benguluri Madhubabu 2026-06-28 12:19:11 0 107
Telangana
"బాటసారులకు చల్లని నీటితో సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీగణేష్.|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలోని పికెట్ లక్ష్మీనగర్‌లో సామాజిక సేవకు మరో మంచి నిదర్శనం...
By Sidhu Maroju 2026-04-11 08:41:37 0 267
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధను (17) అనే యువకుడు...
By Kothuru Murali 2026-05-03 16:30:26 0 147
Telangana
ప్రైవేట్ విద్యా సంస్థలలో కొనసాగుతున్న అక్రమ విద్యా విధానం/
 భారత్ అవాజ్ మీడియా. కరీంనగర్ జిల్లా లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే...
By Thalakokkula Sadanandam 2026-04-17 18:35:11 0 478
Andhra Pradesh
గుడివాడలో మెడికల్ షాపు మాఫియా
🔴 గుడివాడలో మెడికల్ షాప్ మాఫియా    గుడివాడలో మెడికల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేదు......
By Rajini Kumari 2026-04-10 06:29:53 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com