బోయిన్ పల్లి మార్కెట్ సమస్యలపై ఎంపీ ఈటెల ఆగ్రహం.|

0
89

హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళనలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పూర్తి మద్దతు ప్రకటించారు. 

శనివారం మార్కెట్ సందర్శించిన ఆయన, స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, వినియోగదారులకు కనీస టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. 

మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.

ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలో బిజెపి సీనియర్ నేత చింతల మాణిక్య రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Like
1
Search
Categories
Read More
Telangana
"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన...
By Sidhu Maroju 2025-09-20 14:25:21 0 227
Andhra Pradesh
రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్.
AP: రాష్ట్రంలో కొత్తగా 13 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-24 14:51:59 0 107
Telangana
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్  శ్రీ గాయత్రి బ్రాహ్మణ...
By Sidhu Maroju 2025-12-17 14:52:09 0 177
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com