ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ నాంది పలికిన బోండా ఉమామహేశ్వరరావు

0
161

ప్రచురణార్థం:- 26-03-2026

 

*ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ – ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు*

 

ధి:- 26-03-2026 ఈరోజు గురువారం సాయంత్రం BRTS రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు విలేకరుల సమావేశం నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రాంత భవిష్యత్తును మార్చివేసే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ స్థాపనపై పలు కీలక విషయాలను వెల్లడించారు.

 

ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ:- అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పరిధిలో ఏర్పడనున్న ఈ మహత్తర ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని, ఇది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని తెలిపారు.

 

సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడులతో స్థాపించబడుతున్న ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని తెలిపారు. ముఖ్యంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు.

 

ముఖ్యమంత్రి నారా . చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, పరిశ్రమల అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన విజన్, మంత్రి నారా లోకేష్ గారి కృషి , పెట్టుబడిదారులతో సమన్వయం వలననే ఇలాంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయని, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతులు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయని...

 

“జాబ్స్ ఫస్ట్ ” విధానంతో యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ స్టీల్ ప్లాంట్ ఆ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, శిక్షణ కార్యక్రమాలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు మరింత అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు.

 

ఈ ప్రాజెక్ట్ వలన ఉత్తరాంధ్రలో రోడ్లు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతాయని, దీంతో ప్రాంతీయ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని పేర్కొన్నారు. అలాగే MSMEలు, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు విస్తృతంగా అభివృద్ధి చెందడంతో స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుందని అన్నారు.

 

సుమారు 5,465 ఎకరాల్లో నిర్మించబడనున్న ఈ భారీ పరిశ్రమ మొదటి దశలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రారంభమై, తరువాతి దశలో 10.5 మిలియన్ టన్నులకు విస్తరించనుందని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తరణ ద్వారా రాష్ట్రాన్ని ఉక్కు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలపనున్నదని అన్నారు.

 

ఈ ప్రాజెక్ట్ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, పెట్టుబడులు మరింతగా ఆకర్షితమై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దేశంలో ముందంజలో నిలుస్తుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

 

చివరిగా, ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా యువత భవిష్యత్తును మార్చే శక్తివంతమైన అభివృద్ధి యంత్రంగా నిలుస్తుందని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సువర్ణయుగానికి నాంది పలుకుతుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు తెలిపారు.

 

ఈ సమీవేశంలో :- టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు...

Search
Categories
Read More
International
The Beijing Bet: Trump’s Billionaire Tech Summit
 In May 2026, President Trump’s visit to Beijing—flanked by titans like Elon...
By Hazu MD. 2026-05-15 13:18:15 0 64
Telangana
బన్సీలాల్ పేటలోని స్థలం కుర్మ సంఘానిదే : ఎమ్మెల్యే తలసాని
సికింద్రాబాద్ :   బన్సీలాల్ పేట్ లోని ఆ స్థలం కుర్మ సంఘానికి చెందిన స్మశాన వాటిక...
By Sidhu Maroju 2025-09-23 09:02:33 0 277
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 149
Andhra Pradesh
పుంగనూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
పుంగనూరు మండలం వనమలదిన్నెలో కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ...
By Kothuru Murali 2026-03-20 05:45:29 0 120
Andhra Pradesh
రామసముద్రంలో వీధి కుక్కల దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. గురువారం...
By Pagadala Venkateswar 2026-05-15 05:59:32 0 51
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com