మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
212

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 'పరాభవ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ పండగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 

ప్రకృతితో ముడిపడి ఉన్న ఉగాది పర్వదినం, సబ్బండ వర్ణాల శ్రామిక, సాంస్కృతిక జీవనంలో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. ప్రకృతి మాత నూతనోత్సాహాన్ని సంతరించుకున్నట్లే, ప్రజలందరి జీవితాల్లో కూడా కొత్త ఉత్సాహం వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జీవితంలోని కష్టసుఖాలను ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె సమానంగా స్వీకరిస్తూ, వివేచనతో ముందుకు సాగినప్పుడే పరిపూర్ణమైన జీవితం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Telangana
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు.. సగర్వంగా ఆలపించిన రైల్వే ఉద్యోగులు.|
సికింద్రాబాద్ : వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రైల్ నిలయంలో దక్షిణ మధ్య...
By Sidhu Maroju 2025-11-07 14:33:57 0 261
Telangana
యువత హుషార్...
తెలంగాణ లో జరుగుతున్న చివరి విడత.. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యూత చాలా హుషారుగా. పాల్గొని తమ ఓటు...
By CM_ Krishna 2025-12-17 04:02:40 0 297
Andhra Pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
By Benguluri Madhubabu 2026-02-09 08:00:49 0 278
Andhra Pradesh
పుంగనూరు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వ్యక్తిపై దాడి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, మోదుగులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, చౌడేపల్లి మండలం కు...
By Kothuru Murali 2026-04-10 04:45:30 0 120
Andhra Pradesh
గోనెగండ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కర్నూలు డిఐజి ఇంచార్జ్ ఎస్పి
కర్నూలు : కర్నూలు సిటీ :  గోనెగండ్ల  సర్కిల్ కార్యాలయాన్ని  ఆకస్మిక తనిఖీ చేసిన...
By Hari Krishna 2026-01-20 15:03:55 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com