సుభాష్ నగర్ UPHC కి సొంత భవనం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కి వినతి .|

0
165

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుభాష్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్వహణ కోసం ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డాక్టర్ నూరీన్ బేగం శనివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న కేంద్రం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్, వీరేష్, సదానంద్, ప్రభాకర్, మనోజ్, మమత, జీవిత, శ్రీలత, ఉమాదేవి మరియు ఆశా కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Telangana
గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి*
*గ్రామపంచాయతీ నిధులపై ప్రభుత్వ కీలక ఆదేశం: సర్పంచ్–ఉప సర్పంచ్ డబుల్ సంతకం తప్పనిసరి* ...
By Vanmoj Suryamohan 2025-12-29 14:37:26 0 437
Telangana
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా      కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి...
By Nookapangu Manikanta 2026-04-11 02:47:26 0 191
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ:నా వద్ద అన్ని ప్రూఫ్ లు ఉన్నాయి.. బీపీఎం
తన వద్ద తపాలా శాఖకు చెందిన కొందరు అధికారులు నగదు తీసుకున్నారని, వాటికి రశీదులు ఇస్తామని తనను మోసం...
By Kothuru Murali 2026-02-24 11:20:23 0 150
Andhra Pradesh
కరెంట్ షాక్ బాధితుడికి అండగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.
మదనపల్లె మండలం చీకులబైలు గ్రామానికి చెందిన కరుణాకర్ (17) గత ఏడాది డిసెంబర్‌లో కరెంట్...
By Pagadala Venkateswar 2026-06-30 07:04:14 0 60
Telangana
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ : పాల్గొన్న డిసిపి రష్మీ పెరుమాళ్
సికింద్రాబాద్ :   వినాయక చవితిని పురస్కరించుకొని మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు...
By Sidhu Maroju 2025-08-26 09:27:04 0 488
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com