సుభాష్ నగర్ UPHC కి సొంత భవనం ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కి వినతి .|

0
103

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సుభాష్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) నిర్వహణ కోసం ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ డాక్టర్ నూరీన్ బేగం శనివారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న కేంద్రం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కిషోర్ గౌడ్, వీరేష్, సదానంద్, ప్రభాకర్, మనోజ్, మమత, జీవిత, శ్రీలత, ఉమాదేవి మరియు ఆశా కార్యకర్తలు, తదితరులు  పాల్గొన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Telangana
*ఏసీబీ వలలో రెవిన్యూ ఉద్యోగి....*
కారేపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం...
By CM_ Krishna 2025-12-18 13:01:27 0 219
Andhra Pradesh
శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ నాయకులు,...
By Pagadala Venkateswar 2026-03-27 04:12:17 0 82
Andhra Pradesh
లక్ష్మీనరసింహస్వామి ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
కర్నూలు : నంద్యాల : డోన్ :  నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని ప్యాపిలి మండలం...
By Hari Krishna 2026-01-21 08:35:19 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com