అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
167

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాములు,  తెలంగాణ రాష్ట్ర ఎంబీసి (MBC) కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్  పాల్గొన్నారు.

నందికంటి శ్రీధర్  మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో మల్కాజిగిరి నియోజకవర్గం ముందుంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలకు నిధులు కేటాయించిన : సింగరేణి సంస్థ
మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీ అన్ని ఏరియాలో మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల నిర్వహణ...
By Avunoori Mahesh 2026-04-07 05:41:47 0 302
Andhra Pradesh
విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.
తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు...
By Pagadala Venkateswar 2026-05-05 06:34:06 0 92
Telangana
"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు...
By Sidhu Maroju 2026-04-18 17:36:42 0 951
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కలెక్టర్ సారు మమ్మల్ని ఆదుకోండి
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల రెవెన్యూ అధికారి దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని,...
By Kothuru Murali 2026-02-23 11:56:49 0 135
Andhra Pradesh
పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్...
By Kothuru Murali 2026-04-19 11:08:54 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com