అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
130

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాములు,  తెలంగాణ రాష్ట్ర ఎంబీసి (MBC) కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్  పాల్గొన్నారు.

నందికంటి శ్రీధర్  మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో మల్కాజిగిరి నియోజకవర్గం ముందుంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం: సదుం మండలంలో వేలాది కోళ్లు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందినట్లు తహసిల్దార్...
By Kothuru Murali 2026-02-06 09:40:56 0 114
Andhra Pradesh
ఎన్నికల హామీలను అమలు చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్...
By Boiena Rajesh 2026-03-16 03:50:12 0 149
Punjab
ਪੰਜਾਬ ਵਿੱਚ ਬਾਢ਼ ਪੀੜਤਾਂ ਲਈ ਰਾਹਤ ਸਮੱਗਰੀ ਵੰਡੀ ਗਈ
ਬੰਗਾਲ ਤੋਂ ਆਈ #ਸਮਾਜਿਕਸੇਵਕਾਂ ਦੀ ਟੀਮ ਨੇ "#ਪੰਜਾਬਕਾਲਿੰਗ - ਬਾਢ਼ਰਾਹਤਡ੍ਰਾਈਵ2025" ਤਹਿਤ ਅਜਨਾਲਾ, ਡੇਰਾ ਬਾਬਾ...
By Pooja Patil 2025-09-13 07:47:12 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com