పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తి

0
476

పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో గర్భిణీలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి ప్రత్యేక కానుకలు కూడా అందజేయనున్నారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, వైద్య పరీక్షల ప్రాముఖ్యతపై వైద్యులు సూచనలు ఇవ్వనున్నారు.

మాతృత్వానికి గౌరవాన్ని చాటే ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీలలో అవగాహన పెంపొందించడంతో పాటు తల్లి–శిశు ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొబ్బిలిలో పంట పొలాలను సందర్శించిన విద్యార్థులు
బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సోమవారం పంట పొలాలను సందర్శించారు. పంటలు...
By Boiena Rajesh 2026-03-23 11:16:03 0 120
Andhra Pradesh
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల...
By John Baji 2026-01-02 14:28:21 0 147
Andhra Pradesh
బు రదమయమై ప్రజలకు రాకపోకలకు అంతరాయం
రహదారులు నిర్మించండి తూర్పు బీసీ కాలనీలోని 5వ వార్డులో వర్షాలకు రహదారులన్నీ బు రదమయమై ప్రజలకు...
By mahaboob basha 2025-09-30 18:34:16 0 241
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com