"2BHK ఇళ్లు, తాగునీరు, ఆరోగ్య కేంద్రాల కోసం హౌసింగ్ కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వినతి.|

0
153

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. 

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల అవసరాలు, గృహ వసతి మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు అంశాలను ఆయన ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.

కౌకూర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్న ప్రజలకు తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.

అలాగే మౌలాలి ఆయుష్ వెల్నెస్ సెంటర్, యునాని హాస్పిటల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో మౌలాలి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ) నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అల్వాల్ ప్రాంతంలోని భూధాన్ ల్యాండ్స్ సర్వే నంబర్లు 537, 538, 539, 540లలో పేద ప్రజల గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. 

అలాగే నేరేడ్మెట్ డివిజన్ రామకృష్ణాపురంలోని సర్వే నంబర్ 246లో ఉన్న ప్రభుత్వ భూమిలో కూడా 2బీహెచ్‌కే గృహాలను నిర్మించాలని ప్రతిపాదించారు.

సీబీఎన్ కాలనీలో శిథిలావస్థకు చేరుకున్న వాంబే గృహ సముదాయాన్ని కూల్చివేసి ఆధునిక సౌకర్యాలతో పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటిపై హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఎన్. జగదీష్ గౌడ్, మేకల రాము యాదవ్, జేఏసీ వెంకన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:47:43 0 177
Telangana
వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా వాలీ బాల్ టోర్నమెంట్ పోస్టర్ల ను ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల...
By Avunoori Mahesh 2026-04-12 07:00:08 0 148
Andhra Pradesh
గాలివీడు మండలంలో మహాభారత యజ్ఞాన్ని ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం నూరివీడు గ్రామం నాగూరి వాడపల్లి వద్ద 18 రోజులు జరగనున్న మహాభారత...
By Benguluri Madhubabu 2026-04-06 11:46:49 0 229
Andhra Pradesh
ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!
కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి 150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు...
By Pagadala Venkateswar 2026-06-03 11:32:54 0 59
Telangana
నేరేడు పండ్లు కాశాయి.. ఇక వర్షాలు కష్టమేనా?"|
"నేరేడు పండ్లు ఎక్కువగా కాస్తే వర్షాలు పడవా? అపోహలపై నిపుణుల స్పష్టీకరణ" హైదరాబాద్ : ఈ ఏడాది పలు...
By Sidhu Maroju 2026-06-24 12:34:07 0 67
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com