నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*

0
663

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయుటకు విచ్చేసిన బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతం పలికారు.  

షుమారు 10 లక్షల రూపాయలు గ్రామంలో సిమెంట్ రోడ్లు కొరకు అదేవిదంగా మరో 7 లక్షల రూపాయల (షుమారుగా) నిధులను హిందూ స్మశాన వాటిక అభివృద్ధి కొరకు కేటాయించినందుకు ఆ గ్రామ ప్రజా ప్రతినిధిగా గ్రామస్తులు అందరి తరుపున శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు కి ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు.  

గ్రామభివృద్ధి కోసం నిధులు కేటాయించినందుకు తాండ్ర సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలాంటి అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ స్వాగతించాలి అని కోరారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివ సాంబి రెడ్డి తో పాటు ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు.  

కార్యక్రమంలో కర్లపాలెం తశీల్దార్ శ్రీదేవి, ఎంపిడిఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపిడిఓ లు శ్రీనివాసరావు,పద్మావతి లు, సెక్రెటరీ షేక్ షాహిన్, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ మర్రి ఆషా అశోక్, టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, టీడీపీ, జనసేన గ్రామ పార్టీ ఇంచార్జ్ లు మునిపల్లి చిన్నా, గరిగంటి శ్రీనివాసరావులు, కుంటా రత్న బాబు,తాండ్ర శేషగిరి, బీసాబతుని గోపి, తాండ్ర శ్రీనివాసరావు,మొదలగు గ్రామ పెద్దలు, గ్రామస్తులు మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం వెలుగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉద్యోగి అనుమానస్పద మృతి
దోర్నాలలోని వెలిగొండ గెస్ట్ హౌస్ వద్ద గల ఐటీడీఏ ఉపాధిహామీ కార్యాలయం వద్ద చెట్టుకి ఉరి వేసుకొని...
By Chennaiah Kati 2026-02-04 13:22:21 0 172
Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ...
By Benguluri Madhubabu 2026-02-18 03:42:28 0 190
Andhra Pradesh
AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత...
By Pagadala Venkateswar 2026-01-28 10:35:33 0 87
Telangana
నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను...
By Sidhu Maroju 2025-09-16 15:16:07 0 214
Andhra Pradesh
పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదం
పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చిలకవారి గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది....
By Kothuru Murali 2026-02-12 14:00:35 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com